నోరు మెదపరేం చంద్రబాబు! | YSRCP Questions AP Kutami Government Over Axis Power Deal With Proofs, Check Tweet Inside | Sakshi
Sakshi News home page

Axis Power Deal Scam: ‘నోరు మెదపరేం చంద్రబాబు’.. కూటమి సర్కార్‌ విద్యుత్ కొనుగోళ్లపై వైఎస్సార్‌సీపీ ధ్వజం

May 5 2025 9:31 PM | Updated on May 6 2025 12:34 PM

YSRCP Questions AP Government Over Axis Power Deal

సాక్షి,తాడేపల్లి: దేశ విద్యుత్తు రంగ చరిత్రలోనే కూటమి సర్కార్‌ కనీవినీ ఎరుగని స్కామ్‌కు తెర తీసింది! యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కూటమి సర్కారు ఇప్పుడు యూనిట్‌ ఏకంగా రూ.4.60 చొప్పున కొనుగోలుకు సిద్ధమైంది. ఈ విద్యుత్‌ కొనుగోలుపై వైఎస్సార్‌సీపీ ఎక్స్‌ వేదికగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక యూనిట్‌ను రూ.2.49పైసలకే కొనుగోలు చేస్తే విషం చిమ్మిన మీరు ఇప్పుడు ఏకంగా రూ.4.60 పైసలకు ఎలా ఒప్పందం చేసుకుంటారు’అని ప్రశ్నించింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రభుత్వం వచ్చే 25 ఏళ్ల పాటు ఒక్క యూనిట్ విద్యుత్‌ను రూ.4.80కి కొనుగోలు చేయనుంది. ఈ ధర, గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల కంటే రెండింతలు ఎక్కువ. దీని ప్రభావం రాష్ట్ర ప్రజలపై భారీగా ఆర్థిక భారం పడనుంది. అందుకే ఇది విద్యుత్ రంగంలో చోటుచేసుకున్న అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటిగా నిలుస్తోంది. 

మరి దీనిపై చంద్రబాబు నోరెందుకు మెదపడం లేదు. ఈ ఒప్పందం ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చే, ప్రజలకు భారమయ్యే  ప్రణాళికతో చేసిన కుట్ర అని ఆరోపిస్తూ ట్వీట్‌లో పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement