కర్నూలు బస్సు ప్రమాదం.. మరణాలపై హోంమంత్రి అనిత అధికారిక ప్రకటన | Home Minister Anitha Confirms 19 Died And 27 Injured In Kurnool Private Travel Bus Fire Accident | Sakshi
Sakshi News home page

కర్నూలు బస్సు ప్రమాదం.. మరణాలపై హోంమంత్రి అనిత అధికారిక ప్రకటన

Oct 24 2025 3:31 PM | Updated on Oct 24 2025 4:22 PM

home minister anitha on Kurnool Private Travels Bus Incident

సాక్షి,అమరావతి: హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి దాటాక కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణాలపై ఏపీ హోంమంత్రి అనిత అధికారిక ప్రకటన చేశారు.(Kurnool Bus Fire Accident)

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ..‘వేమూరి కావేరీ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంలో 19మంది మృతి చెందగా.. 27మంది ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడ్డ ఆరుగురిలో ముగ్గురికి ప్రాక్చర్లు అయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందో తేల్చేందుకు నాలుగు బృందాలు పనిచేస్తున్నాయి. మృతదేహాలను గుర్తించేందుకు 16మంది ఫోరెన్సిక్‌ నిపుణులను ఏర్పాటు చేసినట్లు’ వెల్లడించారు.
 

బస్సు ప్రమాదంపై హోంమంత్రి అనిత రియాక్షన్

 

Advertisement
 
Advertisement
Advertisement