కూటమి ప్రభుత్వంపై తిరగబడిన ప్రభుత్వ ఉద్యోగులు | Employees Protest At Srikakulam Collectorate | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వంపై తిరగబడిన ప్రభుత్వ ఉద్యోగులు

Sep 27 2025 7:46 PM | Updated on Sep 27 2025 8:22 PM

Employees Protest At Srikakulam Collectorate

శ్రీకాకుళం:  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీరుతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.  సర్వేల పేరుతో తమను వేధిస్తున్నారని శ్రీకాకుళం కలెక్టర్‌ కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు దిగారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటలకు పని చేయాల్సి వస్తుందని, వాలంటీర్లు చేయాల్సిన పనులు కూడా తమతో చేయిస్తున్నారని నిరసన చేపట్టారు.

పనిభారం పెరగడంతో మానసిక ఒత్తిడి అధికమవుతుందని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మహిళా ఉద్యోగులు అని కూడా చూడకుండా రాత్రి పూట కూడా పని చేయిస్తున్నారని విమర్శించారు.  అదే సమయంలో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement