నీరజ్ చోప్రాకు సీఎం జగన్ అభినందనలు
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్-2022లో అద్వితీయ ప్రదర్శన కనబరిచి సిల్వర్ మెడల్ సాధించిన భారత జావెలిన్ స్టార్, ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ‘వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రజతం సాధించిన సుబేదార్ నీరజ్ చోప్రాకు అభినందనలు. చాంపియన్ నీరజ్ చోప్రా మరోసారి భారతదేశ కీర్తిని ఇనుమడింప చేశాడు’అని సీఎం జగన్ ట్విట్టర్లో కొనియాడారు.
కాగా, అమెరికాలోని యుజీన్లో వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భాగంగా ఫైనల్లో నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం జావెలిన్ను విసిరిన నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు.
Congratulations to champion @Neeraj_chopra1 on winning Silver in javelin throw at the #WorldAthleticsChampionships.
Subedar Neeraj Chopra is truly the pride of the nation and the army 🇮🇳— YS Jagan Mohan Reddy (@ysjagan) July 24, 2022