ఎమ్మెల్యే మేరుగకు సీఎం జగన్ పరామర్శ
వేమూరు: హైదరాబాద్లో కోవిడ్ చికిత్స పొందుతున్న వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జునను సీఎం వైఎస్ జగన్ శనివారం ఫోన్లో పరామర్శించారు. తన ఆరోగ్యం గురించి, ఆసుపత్రిలో చేస్తున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున తెలిపారు. తాను త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారన్నారు. తన ఆరోగ్యం మెరుగుపడుతోందని, త్వరలో నియోజకవర్గానికి వెళతానని చెప్పారు.
చదవండి: కొద్ది గంటల్లో పెళ్లి.. అంతలోనే ఊహించని ట్విస్ట్
‘యాస్’ తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు
సంబంధిత వార్తలు