కరోనా వేళా ఏపీలో వృద్ధి | Center Says GSDP Growth Rate Increased In AP During Covid Time | Sakshi
Sakshi News home page

కరోనా వేళా ఏపీలో వృద్ధి 

Dec 12 2022 3:41 AM | Updated on Dec 12 2022 3:42 AM

Center Says GSDP Growth Rate Increased In AP During Covid Time - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలుచేయడంవల్లే దేశంలో మిగి­లిన రాష్ట్రాల కంటే ఏపీలో జీఎస్‌డీపీ (గ్రాస్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌–రాష్ట్ర స్థూల ఉత్పత్తి) వృద్ధి రేటు నమోదవుతోందని కేంద్రం నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. రెండ్రోజుల క్రితం పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ప్రవేశపెట్టిన వివ­రాల్లో.. కరోనా లాంటి విపత్తు సమయంలో దేశ­వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో జీఎస్‌డీపీ వృద్ధిరేటు మైనస్‌ స్థాయికి పడిపోయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌ సహా కేవలం 3 రాష్ట్రాల్లోనే వృద్ధిరేటు నమోదైనట్లు వెల్లడించింది. దీని ప్రకారం.. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఏపీ(0.08%), తమిళనాడు (0.14%), పశ్చిమ బెంగాల్‌ (1.06 %) మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఈ వృద్ధిరేటు మైనస్‌ స్థాయికి పడిపోయినట్లు కేంద్రం పేర్కొంది. 

ఆ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలవల్లే..
మరోవైపు.. ఆ ఆర్థిక సంవత్సరంలో ఏపీ మినహా మిగిలిన రెండు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమి­ళనాడులలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం గమ­నా­ర్హం. ఎన్నికల సంవత్సరంలో ప్రభుత్వాలు పెద్ద­ఎత్తున ప్రజాకర్షక పథకాలు అమలుచేయడం సహ­జం. తమిళ­నాడు, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్ని­కల కారణంగా అక్కడి ప్రభుత్వాలు అమలు­చేసిన సంక్షేమ కార్యక్రమాలతో ఆయా రాష్ట్రాల్లో వృద్ధిరేటు నమోదు కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అప్పటికి 9 నెలల ముందే అసెంబ్లీ ఎన్నికల ప్ర­క్రియ పూర్తయింది.

ఇక మన రాష్ట్రంలో ప్రభు­త్వం పేద­లకు పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమ­లు­చేస్తుండడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడు­తున్నప్ప­టికీ, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభు­త్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా నవరత్నాల పథకా­లను సమర్థవంతంగా అమలుచేస్తోంది. దీని­వల్లే ఆ ఏడాది రాష్ట్రంలో వృద్ధిరేటు సాధ్యమైందని అ«ధికార వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. ఇక ఆ ఏడాది దేశంలో ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరా­లున్న మహా­రాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో వృద్ధిరేటు మైనస్‌ స్థాయిలోనే ఉంది. 

2021–22లో ఏపీనే టాప్‌..
కరోనా అనంతరం 2021–22 ఆర్థిక సంవత్సరంలో అయితే ఏపీ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక వృద్ధిరేటు నమోదు చేసినట్లు పార్లమెంట్‌లో తెలిపిన వివరాల్లో కేంద్రం పేర్కొంది. ఆ ఏడాది దేశంలోనే అత్యధికంగా ఏపీ 11.43% జీఎస్‌డీపీ వృద్ధిరేటును నమోదు చేసినట్లు వెల్లడించింది. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ సహా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ కంటే ఏపీ మెరుగైన వృద్ధిరేటు నమోదుచేసిందని కేంద్రం తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement