ఏపీ: కొనసాగుతున్న వైఎస్సార్‌ పెన్షన్ల పంపిణీ | AP: YSR Pension Distribution Continues By Volunteers | Sakshi
Sakshi News home page

ఏపీ: వైఎస్సార్‌ పెన్షన్ల పంపిణీలో వలంటీర్ల దూకుడు

Jun 1 2022 9:35 AM | Updated on Jun 1 2022 3:43 PM

AP: YSR Pension Distribution Continues By Volunteers - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: బుధవారం తెల్లవారుజాము నుంచే ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు వలంటీర్లు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. సుమారు 60.75 లక్షల మంది పెన్షనర్లకు రూ.1, 543.80 కోట్లు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.

ఉదయం 07.00 గంటల వరకు 30.01 శాతం పెన్షన్ల పంపిణీ ద్వారా సుమారు 18.22 లక్షల మందికి రూ.461.92 కోట్లు అందజేశారు వలంటీర్లు. అలాగే.. ఉదయం ఎనిమిది గంటల వరకు 48.27 శాతం పెన్షన్ల పంపిణీ, 29.32 లక్షలమందికి రూ.744.02 కోట్ల అందజేసినట్లు  ఏపీ పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ముత్యాల నాయుడు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement