దావోస్‌ లేఖపై తప్పుడు ప్రచారం... ఏపీ ప్రభుత్వం హెచ్చరిక | Ap Government Serious On Fake Claims On Davos Letter CM Jagan | Sakshi
Sakshi News home page

దావోస్‌ లేఖపై తప్పుడు ప్రచారం... ఏపీ ప్రభుత్వం హెచ్చరిక

Jan 20 2023 1:59 PM | Updated on Jan 20 2023 2:08 PM

Ap Government Serious On Fake Claims On Davos Letter CM Jagan - Sakshi

సాక్షి, అమరావతి: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనావిుక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌)కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానిస్తూ రాసిన లేఖపై సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఎంను ఆహ్వానిస్తూ నవంబర్‌ 25న వరల్డ్‌ ఎకనావిుక్‌ ఫోరం ప్రెసిడెంట్‌ బోర్జ్‌ బ్రెండే రాసిన లేఖ నకిలీదంటూ పచ్చ మీడియా తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టింది.

తొలుత దావోస్‌కు సీఎంకు ఆహ్వానం అందలేదంటూ చేస్తున్న ప్రచారం అబద్ధమని తేలడంతో, ఆ లేఖ నకిలీదని మరో తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూఈఎఫ్‌ రాసిన లేఖను యథాతథంగా విడుదల చేశామని, దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని గురువారం ప్రభుత్వం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement