గోదావరి వరద బాధితులకు రూ. 2 వేల సాయం

AP Government Announces 2000 For Godavari Flood Victims - Sakshi

సాక్షి, అమరావతి : ఉభయ గోదావరి జిల్లాల వరద బాధితులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకు వచ్చింది. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సహాయక చర్యలలో పాల్గొంటూనే బాధితులను గుర్తించాలని గోదావరి జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.

ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి వరద ముంపు ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. వరద బాధితులకు సహాయం చేసే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

చదవండి : గోదావరి జిల్లాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top