వేటగాళ్ల ఉచ్చుకు ఫారెస్ట్‌ ప్రొటెక్షన్‌ వాచర్‌ బలి | Accident with electric wire installed for wildlife | Sakshi
Sakshi News home page

వేటగాళ్ల ఉచ్చుకు ఫారెస్ట్‌ ప్రొటెక్షన్‌ వాచర్‌ బలి

Oct 20 2025 4:14 AM | Updated on Oct 20 2025 4:14 AM

Accident with electric wire installed for wildlife

మరో నలుగురికి తప్పిన ప్రమాదం 

వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగతో దుర్ఘటన  

పాములపాడు: వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఏర్పా­టు చేసిన విద్యుత్‌ తీగ ఉచ్చుకు తగిలి ఫారెస్ట్‌ ప్రొటెక్షన్‌ వాచర్‌ మృతి చెందగా.. మరో నలుగురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ దుర్ఘటన నంద్యాల మండలం పాములపాడు మండలం బానకచెర్ల గ్రామ సమీపంలోని అడవిలో ఆదివారం జరిగింది. అటవీ అధికారుల కథనం మేరకు.. ఈ నెల 18న రాత్రి ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు, ప్రొటెక్షన్‌ వాచర్లు రాముడు, రాంభూపాల్, విజయ్‌కుమార్, అరుణ్‌కుమార్, లక్ష్మణ్‌నాయక్‌ విధుల్లో భాగంగా వా­హనంలో బయల్దేరారు. 

రోడ్డు పక్కన అడవిలో చెట్ల పక్కన ఒక ద్విచక్ర వాహనం కనిపించడంతో అను­మా­నం వచ్చి అడవిలోకి వెళ్లి చూశారు. దారిలో వేట­గాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగ ఉచ్చు తగలి ప్రొటె­క్షన్‌ వాచర్‌ లక్ష్మణ్‌నాయక్‌ (54) కిందపడ్డాడు. మిగతా వారు వస్తుండగా ‘విద్యుత్‌ ఉంది.. రావొద్దు’ అంటూ కేక వేసి కుప్పకూలిపోయాడు. అప్ప­టికే ఇద్దరికి స్వల్పంగా తీగ తగిలింది. లక్ష్మణ్‌నాయక్‌ను వెంటనే ఆత్మకూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.  

వాహనంపై టీడీపీ ఎంపీ శబరి ఫొటో స్టిక్కర్‌ 
ఘటనా స్థలంలో లభించిన ద్విచక్ర వాహనం నంద్యా­ల జిల్లా మిడుతూరు మండలం తలముడిపికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. వాహనంపై టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఫొటోతో కూడిన స్టిక్కర్‌ అతికించి ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, అటవీ అధికారులు వేటగాళ్లు ఏర్పాటు చేసిన తీగను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement