ఏపీలో కొత్తగా 13,400 కరోనా కేసులు | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 13,400 కరోనా కేసులు

Published Sun, May 30 2021 4:56 PM

13400 New Coronavirus Positive Cases Recorded In AP - Sakshi

సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 79,564 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13,400 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 16,82,247 మందికి కరోనా వైరస్‌ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 94 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 10,832కు చేరింది. గడిచిన 24 గంటల్లో 21,133 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 14 లక్షల 87 వేల 382 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 1,98,023 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,90,88,611 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement