దివ్యాంగ పింఛన్ వెరిఫికేషన్ పేరుతో అధికారులు ఇంటి దగ్గరకు వచ్చి పరిశీలించకుండానే డోర్లాక్ అని రాసేసుకొని పింఛన్ నిలిపివేశారు. జిల్లా కలెక్టర్కు విన్నవించుకుంటే ఫిబ్రవరి నుంచి పింఛన్ వచ్చే విధంగా చూస్తామన్నారు. మూడు నెలలు కావస్తున్నా పింఛన్ మాత్రం ఇవ్వలేదు. నన్ను చూస్తేనే కదా వికలాంగుడా? కాదా? అన్న విషయం తెలుస్తుంది. కేవలం పింఛన్పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న నా పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.
– రమేష్, అరవింద్నగర్, అనంతపురం


