‘పీఎం సూర్యఘర్‌’ను వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

‘పీఎం సూర్యఘర్‌’ను వేగవంతం చేయండి

Jun 24 2025 4:09 AM | Updated on Jun 24 2025 4:09 AM

‘పీఎం సూర్యఘర్‌’ను  వేగవంతం చేయండి

‘పీఎం సూర్యఘర్‌’ను వేగవంతం చేయండి

ఎస్పీడీసీఎల్‌ సీజీఎం వరకుమార్‌

అనంతపురం టౌన్‌: పీఎం సూర్యఘర్‌ పథకంలో భాగంగా అందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీజీఎం వరకుమార్‌ ఆదేశించారు. సోమవారం అనంతపురంలోని ఎస్‌ఈ కార్యాలయంలో విద్యుత్‌ శాఖ అధికారులు, బ్యాంకర్లతో ఆయన సమావేశమై మాట్లాడారు. పీఎం సూర్యఘర్‌ పథకంలో భాగంగా విద్యుత్‌ వినియోగదారులు తమ ఇళ్లపై సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఇంటి అవసరాలకు వినియోగించడంతో పాటు మిగులు విద్యుత్‌ను సంస్థకు విక్రయించుకునేందుకు అవకాశం ఉందన్నారు. కిలో వాట్ల వారీగా సోలార్‌ ఫ్యానళ్ల ఏర్పాటుకు బ్యాంకర్లు సైతం రుణాలను అందజేయాలన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను అందజేస్తోందన్నారు. పీఎం సూర్యఘర్‌ పథకానికి వచ్చిన దరఖాస్తులను ఆయా ప్రాంతాల బ్యాంకర్లుతో సమన్వయం చేసుకొని గ్రౌండింగ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని ఈఈ, ఏడీలను అదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ శేషాద్రి శేఖర్‌, ఈఈ జేవీ రమేష్‌, ఏడీలు శ్రీనివాసులు, చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

ఏపీపీఎస్సీ సభ్యుడిగా

ఆచార్య శశిధర్‌

అనంతపురం: ఏపీపీఎస్సీ (ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) సభ్యుడిగా జేఎన్‌టీయూ (ఏ) సీనియర్‌ ప్రొఫెసర్‌, మాజీ రిజిస్ట్రార్‌ ఆచార్య సి. శశిధర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా జేఎన్‌టీయూ ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది శశిధర్‌కు అభినందనలు తెలిపారు.

హెచ్చెల్సీ పనుల పరిశీలన

కణేకల్లు/బొమ్మనహాళ్‌: తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ పరిధిలో రూ.35.06 కోట్లతో చేపట్టిన ఆధునికీకరణ పనులను క్వాలిటీ కంట్రోల్‌ ఎస్‌ఈ మునీర్‌బాషా, ఈఈ రమేష్‌, డీఈఈ చంద్రశేఖర్‌ సోమవారం తనిఖీ చేశారు. 115వ కిలోమీటర్‌ నుంచి 189వ కిలోమీటర్‌ వరకూ చేపట్టిన బ్రిడ్జి, యూటీ, లైనింగ్‌, అవుట్‌ఫాల్‌ రెగ్యులేటర్‌ పనులతో కలిపి మొత్తం 11 పనులను క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు పరిశీలించారు. నాణ్యత ప్రమాణాల మేరకు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్‌ డీఈఈ చంద్రశేఖర్‌, జేఈ ఓబుళపతి, రమణారెడ్డి, కన్‌స్ట్రక్షన్‌ ఈఈ పార్థసారథి, కణేకల్లు హెచ్చెల్సీ డీఈఈ దివాకర్‌రెడ్డి, జేఈలు నరేంద్రమారుతి, అల్తాఫ్‌, నజురీద్దీన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement