జిల్లా అంతటా బుధవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. నైరుతి దిశగా గంటకు 8 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. | - | Sakshi
Sakshi News home page

జిల్లా అంతటా బుధవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. నైరుతి దిశగా గంటకు 8 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

Jun 26 2025 6:37 AM | Updated on Jun 26 2025 6:37 AM

జిల్లా అంతటా బుధవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఆకా

జిల్లా అంతటా బుధవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఆకా

30 వరకే సబ్‌డివిజన్‌ డ్రైవ్‌

అనంతపురం అర్బన్‌: ‘భూములు రీ–సర్వే జరిగిన గ్రామాల్లో ప్రత్యేక సబ్‌ డివిజన్‌ డ్రైవ్‌ ఈనెల 30 వరకే ఉంటుంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా సమాచారం చేరవేయండి’ అని అధికారులను జేసీ శివ్‌ నారాయణ్‌ శర్మ ఆదేశించారు. సబ్‌ డివిజన్‌ డ్రైవ్‌ అంశంపై జేసీ బుధవారం కలెక్టరేట్‌ నుంచి డివిజన్‌, మండలస్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాయింట్‌ పట్టాదారులుగా నమోదైన రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడంలో నెలకొన్న ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక సబ్‌ డివిజన్‌ డ్రైవర్‌ చేపట్టామన్నారు. రెవెన్యూశాఖ సబ్‌ డివిజన్‌ సేవకు నిర్ధారించిన రుసుము రూ.550లో రూ.500 మినహాయింపు ఇచ్చారన్నారు. నామమాత్రంగా దరఖాస్తు రుసుం రూ.50 సంబంధిత గ్రామ సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌ వద్ద చెల్లించాలన్నారు. తదుపరి జాయింట్‌ పట్టాదారులకు ఉచితంగా సబ్‌డివిజన్‌ చేస్తారన్నారు. ఈ అవకాశం ఈనెల 30 తేదీలోపు దరఖాస్తు చేసుకున్నవారికే ఉంటుందన్నారు. రీ–సర్వే జరిగిన గ్రామాల్లో రైతులకు ఈ విషయాన్ని తెలియజేసి సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సర్వే శాఖ ఏడీ రూప్లానాయక్‌ పాల్గొన్నారు.

ఏఈఓలకు ఇన్‌చార్జ్‌

ఏఓ బాధ్యతలు

అనంతపురం సెంట్రల్‌: వ్యవసాయశాఖలో పలువురు ఏఈఓలకు మండల ఏఓలుగా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ ఉత్తర్వులు జారీ చేశారు. డీ హీరేహాళ్‌ ఏఈఓ ఎన్‌.వి.గోపాల్‌కు బ్రహ్మసముద్రం ఏఓగా, కళ్యాణదుర్గం ఏఈఓ విజయకుమార్‌కు కుందుర్పి, గుత్తి ఏఈఓ మధుకర్‌కు ఉరవకొండ, తాడిపత్రి ఏఈఓ మధుకుమార్‌కు యల్లనూరు మండల వ్యవసాయాధికారిగా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. అలాగే క్వాలిటీ కంట్రోల్‌ కళ్యాణదుర్గం ఏఓగా శ్రావణ్‌కుమార్‌, కంబదూరు ఏఓగా మహేష్‌, గుంతకల్లు ఏఓగా లీనావసుందర, పుట్లూరు ఏఓగా కాత్యాయిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement