ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యం

Jun 26 2025 6:37 AM | Updated on Jun 26 2025 6:37 AM

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యం

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యం

అనంతపురం అర్బన్‌: ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లాస్థాయి ఎస్సీ, ఎస్టీ కాంపొనెంట్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పథకంలో 17.08 శాతం ఎస్సీలకు, 5.53 శాతం ఎస్టీలకు లబ్ధి చేకూర్చాలని ఆదేశించారు. లక్ష్యాలను నిర్దేశించుకుని వందశాతం అమలు చేయాలని చెప్పారు. ‘ఉన్నతి’ పథకం కింద సీ్త్ర నిధి ద్వారా మహిళలకు రుణాలు అందించాలన్నారు. ‘జాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌’ అమలులో దేశంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు. పీఎంఈజీపీ రుణాలకు సంబంధించి యూనియన్‌ బ్యాంక్‌ పరిధిలో సక్రమంగా మంజూరు కావడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, తగిన చర్యలు తీసుకోవాలని డీఐసీ జీఎంను ఆదేశించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ కిట్‌లను లబ్ధిదారులకు అందించాలన్నారు. సమావేశంలో డీటీడబ్ల్యూఓ రామాంజనేయులు, జెడ్పీ సీఈఓ శివశంకర్‌, సీపీఓ అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement