1,39,000 | - | Sakshi
Sakshi News home page

1,39,000

Jun 26 2025 6:37 AM | Updated on Jun 26 2025 6:37 AM

1,39,000

1,39,000

ప్రైవేటు ప్రొవైడర్లు చార్జీలు పెంచడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు వచ్చిన వారు
అనంతపురం1,05,000 పైగా
6,00,000

కలగానే బీఎస్‌ఎన్‌ఎల్‌ పూర్వవైభవం

అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేని సంస్థ

పెరిగిన కస్టమర్లను నిలుపుకోలేని వైనం

అనంతపురం జోన్‌లో లక్ష మందికి పైగా సర్వీసు నుంచి బయటకు

పుట్టపర్తికి చెందిన శ్రీరామ్‌ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసేవాడు. సదరు సంస్థ ‘సీయూజీ’ సిమ్‌ ఇవ్వడంతో ఆ నంబర్‌ వాడేవాడు. కానీ మూడేళ్ల క్రితం ఆయన ఆ సంస్థ నుంచి బయటకు వచ్చాడు. కానీ ఆ నంబర్‌ను వదులుకోలేక పోయాడు. సంస్థను అభ్యర్థించి ఆ నంబర్‌ మరో నెట్‌వర్క్‌లో ఉంటే పోర్టబులిటీ ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారాడు. అప్పటి నుంచి అతనికి సమస్యలు మొదలయ్యాయి. సిగ్నల్‌ సరిగా లేక డాటా కూడా ఉపయోగించలేని పరిస్థితి నెలకొంది. ఎవరికి ఫిర్యాదు చేసినా సేవలు మెరుగుపడకపోవడంతో ఇటీవలే మరో నెట్‌వర్క్‌లోకి మారిపోయాడు.

అనంతపురానికి చెందిన మురళీమోహన్‌రెడ్డి 20 ఏళ్లుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ నంబర్‌ వాడుతున్నారు. సిగ్నల్‌ సమస్య వచ్చినా, నెట్‌వర్క్‌ సరిగా రాకపోయినా మరో నెట్‌వర్క్‌లోకి మారేందుకు ఇష్టపడలేదు. కానీ రానురాను సమస్య మరీ తీవ్రంగా మారింది. ఇన్‌కమింగ్‌ కాల్స్‌ కూడా రావడం లేదు. పైగా

మిత్రులంతా ఎందుకని ఎప్పుడూ సెల్‌ స్విచాఫ్‌ చేసుకుని ఉంటావంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. దీంతో మురళీమోహన్‌రెడ్డి కస్టమర్‌ కేర్‌కు ఫిర్యాదు చేశారు. ఫలితం లేదు. బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయానికి వెళ్లి సమస్య వివరించినా ఫలితం లేకపోవడంతో ఇటీవల మరోనెట్‌వర్క్‌కు మారిపోయాడు.

సేవలు సరిగా లేక

సాక్షి ప్రతినిధి, అనంతపురం: అవకాశాలు రాక.. వ్యాపారాలు లేక చాలా దిగ్గజ సంస్థలన్నీ నిరాశగా ఉండగా బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయింది. ఒక దశలో లక్షలాది మంది కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ కావాలని సిమ్‌లు తీసుకుంటే వారికి సర్వీసు ఇవ్వ లేక చతికిల పడింది. సిగ్నల్స్‌ ఉండవు, ఫిర్యాదు చేస్తే పట్టించుకోరు, నెట్‌ సరిగా రాకపోవడంతో సిమ్‌కార్డు ఎందుకు తీసుకున్నాం రా బాబూ అంటూ వినియోగదారులు గగ్గోలు పెట్టిన పరిస్థితి. అనంతపురం, వైఎస్సార్‌ కడప జిల్లాల పరిధిలో ఎంతో ఆశగా బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌లు తీసుకున్న సంతోషం నాలుగు నెలల్లోనే ఆవిరి అయిపోయింది.

టారిఫ్‌లు పెంచడంతో..

కొన్ని నెలల క్రితం జియో, ఎయిర్‌టెల్‌ వంటి ప్రైవేటు మొబైల్‌సర్వీస్‌ ప్రొవైడర్లు ఒక్కసారిగా నెలవారీ చార్జీలు పెంచాయి. దీంతో అనంతపురం జోన్‌ (కడప–అనంతపురం) పరిధిలో సుమారు 1.85 లక్షల మంది కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మొగ్గుచూపారు. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు పూర్వవైభవం వచ్చినట్టయింది. కానీ కస్టమర్ల సంతోషం ఎక్కువరోజులు నిలవలేదు. సిమ్‌కార్డు తీసుకున్న వారం లోనే కష్టాలు మొదలయ్యాయి. మొబైల్‌కు సిగ్నల్స్‌ రాకపోవడం, నెట్‌సరిగా ఉండకపోవడం, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విసుగెత్తిపోయారు. పైగా సిబ్బందికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేక పోవడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇంకా 4జీనే..

అనంతపురం, వైఎస్సార్‌ కడప జిల్లాలను ఒక జోన్‌గా పరిగణిస్తారు. ఇటీవల ఈ జోన్‌లో సుమారు 1.85 లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారారు. దీంతో భారీగా బిజినెస్‌ పెరిగింది. సిమ్‌లు విచ్చలవిడిగా అమ్ముడయ్యాయి. కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. కానీ నెలరోజుల్లోనే నెట్‌వర్క్‌ సరిగా పనిచేయలేదు. కాస్త రూరల్‌కు వెళితే సిగ్నల్స్‌ లేవు. పైగా ప్రైవేటు సర్వీసు ప్రొవైడర్లు 6జీకి వెళుతుంటే బీఎస్‌ఎన్‌ఎల్‌లో 4జీనే సరిగా రాదు. దీంతో కస్టమర్లలో సుమారు 1.39 లక్షల మంది వెనక్కు వెళ్లిపోయారు. టవర్లు తక్కువగా ఉండటం, సర్వీసులను ఉన్నతీకరించక పోవడం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడి వెనక్కు వెళ్లినట్టు తెలుస్తోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి

తిరిగి వెనక్కు వెళ్లిన వారు

వైఎస్సార్‌ కడప 80,000 పైగా

అనంతపురంజిల్లాలో టవర్లు

ప్రస్తుతం రెండు జిల్లాల్లో

బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లు

450 వరకూ

వైఎస్సార్‌ కడప జిల్లాలో టవర్లు

350 వరకూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement