అనంతలో మళ్లీ ఎడారి ఛాయలు | - | Sakshi
Sakshi News home page

అనంతలో మళ్లీ ఎడారి ఛాయలు

Jun 3 2025 12:24 AM | Updated on Jun 3 2025 12:24 AM

అనంతలో మళ్లీ ఎడారి ఛాయలు

అనంతలో మళ్లీ ఎడారి ఛాయలు

ఆత్మకూరు: సీఎం చంద్రబాబు తీరుతో జిల్లాలో మళ్లీ ఎడారి ఛాయలు అలుముకుంటున్నాయని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మండలం పంపనూరు వద్ద హంద్రీ–నీవా కాలువలో లైనింగ్‌ పనులను రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులతో కలసి ఆయన పరిశీలించి, మాట్లాడారు. హంద్రీ నీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే మహోన్నత లక్ష్యంతో దివంగత నేత వైఎస్సార్‌ హంద్రీనీవా ప్రాజెక్ట్‌ను చేపట్టారని గుర్తు చేశారు. 2015లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 లక్షల ఎకరాలను రద్దు చేస్తూ జీఓ 22 ఇచ్చారన్నారు. మళ్లీ జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెరువులతో పాటు 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో 63 టీఎంసీల ప్రవాహ సామర్థ్యంతో శ్రీశైలం డ్యాం మల్యాల నుంచి కాలువను వెడల్పు చేసేలా జీఓ ఇచ్చి, పనులు మొదలు పెట్టారన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టుకు 3 టీఎంసీలు ఇచ్చి కర్నూలు ప్రజల దాహార్తిని తీర్చాలని, డోన్‌ ప్రాంతంలో 63 చెరువులకు2 టీఎంసీలు, శింగనమల, శింగనమల రూరల్‌ చెరువులకు 2.3 టీఎంసీలు కేటాయిస్తూ జీఓ ఇచ్చారన్నారు. అలాగే జీడిపల్లి నుంచి 3.7 టీఎంసీలు భైరవానితిప్ప ప్రాజెక్ట్‌కు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని చెరువులకు సంబంధించి 114 చెరువులకు నీరు ఇచ్చేలా కార్యాచరణను రూపొందించారన్నారు. పేరూరు డ్యాంకు జీడిపల్లి నుంచి నీళ్లు ఇస్తూ సోమరాండ్లపల్లి , పుట్టకనుమ, తోపుదుర్తి, ముట్టాల చెరువులకూ 4.3 టీఎంసీలు కేటాయించారన్నారు. పుట్టపర్తి లిప్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ ద్వారా 193 చెరువులకు, కియో ఫ్యాక్టరీకి నీరు ఇచ్చే బృహత్‌ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌లన్నీ రద్దు చేస్తూ నిధుల దుర్వినియోగానికి తెరలేపిందన్నారు. గతంలో అమిలినేని సురేంద్రబాబు కాలువ మీద 20 లక్షల క్యూబిక్‌ మీటర్ల రాయి అమ్ముకున్నారన్నారు. ప్యాకేజ్‌ 2లో రూ.9 కోట్ల పనులను రూ.95 కోట్లకు బిల్లులు చేసుకున్నారని తెలిపారు. ఫ్యాకేజి 3లో రూ.40 కోట్ల పనులకు సంబంధించి రూ.105 కోట్ల బిల్లులు చేసుకున్నారని వివరించారు. హంద్రీ నీవా కాలువ లైనింగ్‌పనులతో రైతులకు తీరని నష్టమన్నారు. కాలువను 63 టీఎంసీలతో అనంతపురం, కర్నూలు జిల్లాలకు పరిమితం చేయాలని, జగనన్న తీసుకొచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేసి చిత్తూరు, కడప జిల్లాలకు నీరు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పిల్ల కాలువల నిర్మాణం చేపట్టి 6 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చే ఏర్పాటు చేసిన తరువాతనే లైనింగ్‌ పనులు చేసుకోవాలన్నారు. గండికోట నుంచి గాలేరు నగరికి అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలో హంద్రీ నీవా పుంగనూరు బ్రాంచ్‌కెనాల్‌కు లిప్ట్‌ ఇరిగేషన్‌ కొనసాగించాలని దీనిని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్ల సాధనలో భాగంగా గ్రామ సభలు నిర్వహించాలన్నా, పాదయాత్రలు చేయాలన్నా, సభలు పెట్టాలన్నా అధికారులు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అధికారులు అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ నెల 9న తోపుదుర్తి గ్రామంలో తన నివాసం వద్దనే వేల మంది రైతులతో నిరాహార దీక్ష చేపడుతానని ప్రకటించారు.

అనంతపురం, కర్నూలు జిల్లాలకు

63 టీఎంసీల నీరు ఇవ్వాల్సిందే

లైనింగ్‌ పనులతో రైతులకు నష్టం

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే

తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement