
రేషన్ సక్రమంగా అందించాలి
‘క్లీన్ ఎయిర్’
పనులు పూర్తి చేయాలి
అనంతపురం అర్బన్: నగర పరిధిలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్సీఏపీ) కింద చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేపట్టిన మల్టీ లెవల్ పార్కింగ్ పనులు పది రోజుల్లో పూర్తవ్వాలన్నారు. రామ్నగర్ బ్రిడ్జి వద్ద గ్రీనరీ అభివృద్ధి, ఇతర పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించాలని ఆదేశించారు. పనులను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, నాణ్యతా ప్రమాణాలు లేనట్లు తేలితే సంబంధిత అఽధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సమావేశంలో నగర పాలక కమిషనర్ బాలస్వామి, ఎస్ఈ చంద్రశేఖర్, డీటీసీ వీర్రాజు, ఈఈ షాకీర్ హుసేన్, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం అర్బన్: కార్డుదారులకు డీలర్లు రేషన్ సక్రమంగా అందించేలా చూడాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ గురువారం సాయినగర్ లోని పలు చౌక దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్, బియ్యం, తూకం తదితరాలను పరిశీలించారు. కార్డుదారుల ఇళ్లకు వెళ్లి సరుకులు పంపిణీ ఎలా చేస్తున్నారు... తూకం సరిగా ఇస్తున్నారా.. అని ఆరాతీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్టీజీఎస్ ఫీడ్బ్యాక్లో అనంతపురం అర్బన్లో ఎక్కువ మంది కార్డుదారులు బియ్యం నాణ్యత బాగా లేదని చెప్పారన్నారు. దీంతో క్షేత్రస్థాయిలో తనిఖీ చేయడంతో పాటు లబ్ధిదారులతో మాట్లాడామన్నారు. అనంత పురం రూరల్, గుంతకల్లు మండలాల్లో బియ్యం తక్కువగా ఇస్తున్నారనే ఫిర్యాదులు అధికంగా వచ్చాయన్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ వెంకటేశ్వర్లు, తహసీల్దారు హరికుమార్, సీఎస్డీటీ రామకృష్ణ, వీఆర్ఓలు పాల్గొన్నారు.
బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేయాలి
బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేయాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. ‘కిషోరీ వికాసం’లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కిషోరీ వికాసం’లో జూన్ 10 వరకు జరిగే సమ్మర్ స్పెషల్ క్యాంపెయిన్లో డీఆర్డీఏ పీడీ పాల్గొనాలని, బాల్యవివాహాలపై అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో గోడలపై పెయింటింగ్ వేయించాలని జెడ్పీ సీఈఓని ఆదేశించారు.గుత్తి, గుంతకల్లు ప్రాంతాల్లో ముస్లిం వర్గాల్లో బాల్యవివాహాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందన్నారు. మత పెద్దల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు మెమెంటో, ప్రశంసాపత్రాలను అందజేశారు.
కలెక్టర్ వినోద్కుమార్