
మెడికల్ కళాశాల అకౌంటెంట్పై ఫిర్యాదు
అనంతపురం: మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న మహిళా విద్యార్థినులకు సంబంధించిన మెస్ బిల్లులను నేరుగా సొంత ఖాతాలో జమ చేసుకున్న అకౌంటెంట్ వాణిపై కేసు నమోదు చేయాలని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ .మాణిక్యరావు కోరారు. ఈ మేరకు అనంతపురం టూటౌన్ పోలీస్స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. హాస్టల్ బ్యాంకు ఖాతాకు కాకుండా తన వ్యక్తిగత ఫోన్పే నంబర్కు మెస్ బిల్లుల మొత్తాన్ని అకౌంటెంట్ జమ చేయించుకున్నాన్నారు. కొన్ని నెలలుగా మెస్బిల్లుల మొత్తం హాస్టల్ బ్యాంకు ఖాతాకు జమ చేయలేదన్నారు. ప్రొఫెసర్లు కమిటీ విచారణలో ఈ విషయం తేటతెల్లమైందన్నారు. డబ్బు తిరిగి చెల్లించేలా చూడాలని విన్నవించారు.