
కుటుంబానికి చేదోడుగా ఉంటూ..
మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. మా తల్లిదండ్రులకు ఏడుగురు సంతానం కాగా, ఇద్దరు కుమార్తెలు, ఐదుగురు కుమారులు ఉన్నారు. కుమారుల్లో నేనే పెద్దవాడిని. అమ్మ, నాన్న ప్రోత్సాహం.. గురువులు జయరాజు, ఈశ్వరయ్య స్ఫూర్తితో చదువులపై ఆసక్తి పెంచుకున్నా. ఓ వైపు వ్యవసాయ పనుల్లో అమ్మ, నాన్నకు తోడుగా ఉంటూనే మరోవైపు స్కూల్కు వెళ్లి వచ్చేవాడిని, ప్రాథమిక విద్యాభ్యాసం ముగిసిన తర్వాత దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పామిడిలోని పాఠశాలకు సైకిల్పై వెళ్లి వచ్చేవాడిని. పట్టుదలతో చదువుకుని ఎంఏ, బీఈడీ చేశాను. 35 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాను. నన్ను ఆదర్శంగా తీసుకుని గ్రామంలోని చాలా మంది ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం గర్వంగా ఉంది.
– అనంతయ్య, విశ్రాంత టీచర్,
దేవరపల్లి, పామిడి మండలం