
8 నుంచి పీజీ పరీక్షలు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 8న ప్రారంభం కానున్నాయని డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు. పీజీ పరీక్షలు ఈ నెల 13న ముగుస్తాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా యూజీ రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలను ఆయన పర్యవేక్షించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని నాలుగు డిగ్రీ కళాశాలలను తనిఖీ చేశారు.
17న జేఎన్టీయూ
స్నాతకోత్సవం
● ముఖ్య అతిథిగా గవర్నర్
జస్టిస్ అబ్దుల్ నజీర్
● 40 మంది విద్యార్థులకు
బంగారు పతకాలు
● స్నాతకోత్సవ నిర్వహణకు
ప్రత్యేక కమిటీల నియామకం
అనంతపురం: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపురం (జేఎన్టీయూ–ఏ) స్నాతకోత్సవం ఈ నెల 17న నిర్వహించనున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ చాన్సలర్, ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. 2023–24 విద్యా సంవత్సరంలో బీటెక్, బీ ఫార్మసీ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎమ్మెస్సీ పూర్తి చేసిన విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలు అందజేస్తారు. పీహెచ్డీ పూర్తి చేసిన వారికి డాక్టరేట్ ప్రదానం చేస్తారు. ముఖ్య అతిథిగా చాన్సలర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ స్నాతకోత్సవాన్ని ఉద్ధేశించి ప్రసంగిస్తారు. బంగారు పతకాలకు ఎంపికై న వారికి గవర్నర్ అందజేస్తారు. పీహెచ్డీ పూర్తి చేసిన వారికి గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందజేస్తారు. గౌరవ డాక్టరేట్ ఎవరికి అందించాలనే అంశంపై మూడు పేర్లతో కూడిన జాబితాను గవర్నర్కు పంపారు. త్వరలోనే గౌరవ డాక్టరేట్ పేరు ఖరారు కానుంది. జేఎన్టీయూ అనంతపురం పరిధిలోనూ, క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల, పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలలో టాపర్లు బంగారు పతకాలకు ఎంపికయ్యారు. స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా 17 కమిటీలను నియమించారు. ఇందులో ప్రొఫెసర్లను నియమించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు కమిటీలను నియమించినట్లు వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు తెలిపారు.

8 నుంచి పీజీ పరీక్షలు