
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
బొమ్మనహాళ్: విద్యుత్ షాక్కు గురై ఓ కౌలు రైతు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో నివాసముంటున్న శ్రీరామ్ (33)కు భార్య మహాలక్ష్మి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తున్న ఆయన.. అదే గ్రామ నివాసి రైతు ఆనందరెడ్డికి చెందిన ఆరు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వారం రోజుల క్రితం సజ్జ పంట సాగు చేశాడు. శనివారం అర్ధరాత్రి సమయంలో వ్వవసాయానికి విద్యుత్ సరఫరా కావడంతో పంటకు నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లి, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. నిరుపేద కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని గ్రామస్తులు కోరారు.