రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Dec 12 2025 6:28 AM | Updated on Dec 12 2025 6:28 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

● మోటారు సైకిల్‌ను ఢీకొన్న కారు ● మరొకరికి తీవ్రగాయాలు

ప్రమాదంలో తునాతునకలైన మోటారు సైకిల్‌, దెబ్బతిన్న కారు (ఇన్‌సెట్‌) ప్రమాదంలో మృతి చెందిన నూకరాజు

జగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద ముందు వెళ్తున్న మోటారు సైకిల్‌ను వెనుక వస్తున్న కారు బలంగా ఢీకొని ఇద్దరు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. ఎస్సై రఘునాథరావు అందించిన వివరాల ప్రకారం ఏలేశ్వరం గ్రామానికి చెందిన దొండపాటి శ్రీను, అతని తాత బొల్లం నూకరాజు (64) ఎక్స్‌ఎల్‌ వాహనంపై జగ్గంపేట వస్తున్నారు. నర్సీపట్నం గ్రామానికి చెందిన వేమూరి మురళీకృష్ణ, తన కోడలు బొల్లిన శ్రీదేవి (35)ని తీసుకుని తన కోడలు పుట్టిల్లు రాజానగరం మండలం నందరాడ గ్రామానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు జగ్గంపేట మండలం రామవరం వద్ద బొప్పిడి సిరామిక్స్‌ సమీపంలో ఎక్స్‌ఎల్‌ను బలంగా ఢీకొంది. దీనితో నూకరాజు అక్కడికి అక్కడే మృతి చెందాడు. మోటారు సైకిల్‌ తుక్కుతుక్కు కాగా కారు కూడా ముందుబాగం బాగా దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న బొల్లిన శ్రీదేవి, మురళీకృష్ణలకు కూడా తీవ్రగాయాలయ్యాయి. వారిని రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి ఆసుపత్రిలో బొల్లిన శ్రీదేవి మృతి చెందినట్లు ఎస్సై రఘునాథరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి 1
1/1

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement