
బాసలు చేశారు... బాటలు మరిచారు!
అధ్వానంగా బీఎన్ రోడ్డు
ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని కూటమి పాలకులు
బురదలో కూరుకుపోయిన వాహనాలను ట్రాక్టర్లతో
లాగుతున్న డ్రైవర్లు
బుచ్చెయ్యపేట : ఎన్నికల్లో గెలిస్తే ముందుగా భీమునిపట్నం, నర్సీపట్నం (బీఎన్) రోడ్డు బాగు చేస్తామన్న కూటమి నేతల మాటలు కోటలు దాటాయి. శిథిలావస్థకు చేరిన రోడ్డును బాగు చేయడం దేవుడెరుగు కనీసం గోతులను పూడ్చి రవాణా సదుపాయం కల్పించడానికి కూటమి నేతలు చేతులెత్తేశారు. గత ప్రభుత్వం రోడ్లను బాగు చేయడంలో విఫలమైందని, తాము అధికారంలోకి వస్తే రోడ్లు బాగు చేసేస్తామన్న కూటమి నేతలు ఎమెమల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, ఎంపీ రమేష్ ఇపుడు బీఎన్ రోడ్డు వైపు కన్నెత్తి చూడకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. వడ్డాది, శింగవరం, విజయరామరాజుపేట, ఎల్బీ పురం, బంగారుమెట్ట, లక్ష్మీపురం పొలాలు వద్ద, మేడివాడ, గర్నికం, రోలుగుంట, గోవాడ తదితర ప్రాంతాల వద్ద పెద్దపెద్ద గోతులు పడ్డాయి. గోతుల్లో వర్షం నీరు చేరి తారు రోడ్డు బురద మట్టి రోడ్డులా తయారైంది. పలు గోతుల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఐదు అడుగుల లోతు వరకు రోడ్డు మధ్యలో గోతులు పడడంతో ప్రతి రోజు ఆటోలు, వ్యాన్లు, లారీలు బురదలో కూరుకుపోతున్నాయి. బురదలో కూరుకుపోతున్న వాహనాలను పొక్లెయిన్లు, ట్రాక్టర్లకు తాడు కట్టి బయటకు లాగుతున్నారు. ఆస్పత్రులకు వెళ్లే గర్భిణులు, బాలింతలు బీఎన్ రోడ్డులో ప్రయాణానికి నరకయాతన పడుతున్నారు. ఆటోలు ఇతర వాహనదారులు ఈ రోడ్డులో ప్రయాణించి బేరింగ్లు పోయి వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని ఆయా వాహనదారలు ఆవేదన చెందుతున్నారు. ప్రయాణానికి నరకంగా మారిన బీఎన్ రోడ్డును బాగు చేయాలని ఇటీవల వడ్డాది గోతుల్లో వలలు వేసి చేపలు పడుతూ పలువురు నిరసన తెలిపారు. అయినా కూటమి నేతలు, అధికారుల్లో మాత్రం చలనం లేదు. ఇప్పటికై నా కూటమి నేతలు, ఆర్అండ్బీ అధికారులు స్పందించి బీఎన్ రోడ్డు బాగు గురించి చర్యలు చేపట్టాలని, సుఖ ప్రయాణం కల్పించాలని చోడవరం నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
చెరువులను
తలపిస్తున్న గోతులు
బురదలో
కూరుకుపోతున్న వాహనాలు

బాసలు చేశారు... బాటలు మరిచారు!

బాసలు చేశారు... బాటలు మరిచారు!

బాసలు చేశారు... బాటలు మరిచారు!

బాసలు చేశారు... బాటలు మరిచారు!

బాసలు చేశారు... బాటలు మరిచారు!

బాసలు చేశారు... బాటలు మరిచారు!