
అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు
చోడవరం: పార్టీలో అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని చోడవరం సమన్వయకర్త, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక లక్ష్మమ్మ ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామ కల్యాణమండపంలో చోడవరం మండల కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది. పట్టణం, మండలం నలుమూల నుంచి వందలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరుకావడంతో పార్టీ కేడర్లో నూతనుత్తేజం వచ్చింది. ఈ సందర్భంగా అమర్నాఽథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో దౌర్జన్యాలు పెచ్చుమీరిపోయాయన్నారు. ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులపై కూడా కూటమి నాయకులు దౌర్జన్యాలకు దిగడం ప్రభుత్వ రాక్షసిపాలనకు అద్దం పడుతోందని చెప్పారు. వడ్డాది కేజీబీవీ ప్రిన్సిపాల్ను స్థానిక ఎమ్మెల్యే మానసికంగా వేధించారని తెలిపారు. ఇటువంటి దౌర్జన్యాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఉందన్నారు. వచ్చే నెల 8వతేదీన వైఎస్సార్ జయంతిని అన్ని గ్రామాల్లో ఘనంగా జరపాలన్నారు. అదేవిధంగా త్వరలో నిర్వహించే ఇంటింటికీ వెళ్లి కూటమి ఏడాదిపాలనలో వైఫల్యాలను తెలియజేసే కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్తలు అంకితభావంతో నిర్వహించాలన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. పార్లమెంటు సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు నిత్యం ప్రజలను మోసం చేస్తూనేఉన్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలను, ప్రభుత్వ అధికారులను, ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు బాబు షూరిటీ..మోసం గ్యారంటీ అనే నినాదంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఇంటింటికి వెళ్లే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. చోడవరం నియోజకవర్గంలో కూటమి నాయకులు చేస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలపై ఎక్కడిక్కడ నిలదీయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే, పార్లమెంటు పరిశీలకురాలు శోభా హైమావతి మాట్లాడుతూ చంద్రబాబు మోసాలపై ప్రజలకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు వివరించాలన్నారు. అనంతరం నాయకులను పార్టీ కార్యకర్తలు పూలదండలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మిలట్రీనాయుడు, రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, జెడ్పీటీసీలు మారిశెట్టి విజయశ్రీకాంత్, దొండా రాంబాబు, ఎంపీపీ గాడి కాసుఅప్పారావు, పంచాయతీ ఉపసర్పంచ్ పుల్లేటి వెంకట్రావు, మండల, పట్టణ అధ్యక్షులు దొడ్డి వెంకట్రావు, దేవరల్లి సత్య, జిల్లా యూత్, రైతు విభాగాల అధ్యక్షులు పుల్లేటి వెంకటేష్, బొడ్డేడ సూర్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షురాలు బొగ్గు శ్యామల, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఓరుగంటి నెహ్రూ, పట్టణ ప్రతినిధులు పందిరి శ్రీనువాసరావు, గూనూరు రాజు, చవితిన బాబూరావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పల్లా నర్సింగరావు, పీఏసీఎస్ అధ్యక్షులు శానాపతి సత్యారావు, దన్నిన వెంకట్రావు, పుట్రేవు శ్యామ్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
గుడివాడ అమర్నాథ్

అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు