
యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస
అనకాపల్లి : కష్టపడి చదువుకోవడం కంటే ఇష్టపడి చదువుడం వల్ల ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయ రహదారి సత్యగ్రాండ్ ఫంక్షన్ హాల్లో జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు ఆదివారం ప్రతిభా పురస్కారాలను వారు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది యాదవ సంఘం ఆధ్వర్యంలో జిల్లాలో స్కాలర్షిప్స్ ఇవ్వడం విద్యార్థుల ఉన్నత చదువులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం ఇంటర్లో 992 మార్కులతో మొదటి స్థానం సాధించిన రందాసు శ్రీజకు రూ. 5000, మెమెంటో, 985 మార్కులతో ద్వితీయ స్థానం సాధించిన చందక రోస్నకు రూ.2500, మెమెంటో, పదోతరగతిలో 594 మార్కులతో మొదటి స్థానం సాధించిన బాలబోయిన బాలాజీకి రూ.5000 మెమెంటో, 592 మార్కులతో ద్వితీయస్థానం సాధించిన పల్లా అనుష్కకు రూ.2500, మెమెంటోతో పాటు, మరో 200 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున నగదు, కాలేజీ బ్యాగ్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు భరణికాన సాయినాథరావు (బాబురావు ), ఉమ్మడి విశాఖ జిల్లా డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు భరణికాన రామారావు, సంఘ నాయకులు పాల్గొన్నారు.