
విద్యుత్ అధికారులూ ఇదేం తీరు...?
నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీకి విద్యుత్ లైన్ ఏర్పాటులో భాగంగా విద్యుత్ శాఖ సిబ్బంది తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మా భూమి మధ్యలోంచి విద్యుత్ స్తంభాలు వేసి ఇల్లు కట్టుకోకుండా చేసారని, తక్షణమే తొలగించి మాకు న్యాయం చేయాలంటు కశింకోట మండలం నర్సింగబిల్లి గ్రామానికి చెందిన నారపిన్ని తాతారావు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. తమకు కేవలం 20 సెంట్ల భూమి మాత్రమే ఉందని, అందులో వారం రోజుల క్రితం తమకు తెలియకుండా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసేసారని, విద్యుత్ సిబ్బందిని అడిగితే ఇప్పుడు తొలగించడం కుదరదంటున్నారని, ఇల్లు కట్టుకుందామనుకున్న లోపే ఇలా స్తంభాలు వేసి తీవ్ర అన్యాయం చేస్తున్నారని, తక్షణమే విద్యుత్ స్తంభాలు తొలగించాలని కోరారు.