
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కోటవురట్ల: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలు ఇవి. రాట్నాలపాలేనికి చెందిన కాలాబత్తుల రాజ్కుమార్(56) ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డులోని ఓ హోటల్లో చెఫ్గా పనిచేస్తున్నాడు. హోటల్లో పని ముగించుకుని ఆదివారం రాత్రి కోటవురట్లకు వస్తుండగా రామచంద్రపురం జంక్షన్ దాటాక పైలట్ ప్రాజెక్టు వద్ద ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అతనిని అంబులెన్సులో విశాఖలోని కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించినట్టు ఎస్ఐ తెలిపారు.