
సచివాలయ విద్యుత్ కార్మికుల నిరసన
అనకాపల్లి: గ్రామ/వార్డు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎనర్జీ అసిస్టెంట్, జూనియర్ లైన్మాన్ గ్రేడ్–2 ప్రతిపాదిత బదిలీలు, రేషనలైజేషన్కు ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేయడం అన్యాయమని, దీనిని తక్షణమే నిలుపుదల చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సత్యారావు అన్నారు. స్థానిక గవరపాలెం నిదానందొడ్డి విద్యుత్శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ జి.ప్రసాద్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్లకు సంబంధించిన ప్రత్యేకమైన పని విధానం, 24 గంటలు అందుబాటులో ఉండి అత్యవసర పరిస్థితుల్లో సచివాలయం ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు వేపాడ సత్యనారాయణ, రీజనల్ అధ్యక్షుడు ప్రేమ చంద్రశేఖర్, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.శ్రీనివాసరావు, కె.మాధవి, కె.నాగ అప్పారావు, జేఎల్ఎం గ్రేడ్–2 నాయకులు అప్పలరాజు, శంకర్, అక్కునాయుడు, గంగాధర్, చంద్రరావు పాల్గొన్నారు.