
జగనన్న ఇంటి పట్టాను విక్రయించేశారు
జగనన్న కాలనీలో ఇచ్చిన పట్టాను తనకు తెలియకుండా విక్రయించేసి మరో చోట పట్టా ఇస్తానంటూ మోసం చేసిన సచివాలయం, తహసీల్దార్ కార్యాలయం అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తుమ్మపాల కొత్తపేట వీధికి చెందిన దూడ నూకమ్మ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. తనకు మారేడుపూడి గ్రామం సర్వే 205లో ప్లాట్ నెం.13 స్థలం మంజూరు చేసి జియోటాగింగ్ కూడా చేశారని, ఇల్లు కట్టడం ఆలస్యమైనందున నా స్థలాన్ని గ్రామ నాయకులు ఇతరులకు విక్రయించేసి అన్యాయం చేశారని వాపోయింది. అధికారులు విచారణ చేపట్టి తన స్థలంలో ఇల్లు కట్టుకునేలా చేయాలని వేడుకుంది.