
వాస్తవాలు చెప్పే దమ్ము లేదా?
మహారాణిపేట (విశాఖ): టీడీపీ మంత్రుల దగ్గర నుంచి కార్పొరేషన్ చైర్మన్ల వరకు గిరిజనం గురించి అవాస్తవాలు చెబుతున్నారని, అవగాహనలేమితో మాట్లాడుతున్నారా.. లేదా నిజం చెబితే ప్రజలు ఛీకొడతారని ముందే గ్రహించి ప్రజలను తప్పుదా రి పట్టిస్తున్నారా అని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర ప్రశ్నించారు. మహానాడు వేదికగా జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ చిల్లర మాట లు మాట్లాడారని ఆమె మండిపడ్డారు. విశాఖలోని జెడ్పీ బంగ్లాలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వ చ్చిన తర్వాత దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్న గిరిజనుల కోసం ఏడాది కాలంలో ఒక్క సంక్షేమ పథకమైనా ప్రత్యేకంగా అమలు చేశారా.. అని ఆమె నిలదీశారు. సూపర్ సిక్స్ వాగ్దానాలను అటకెక్కించారని, కనీసం గిరిజన రైతుల ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా వేశారా? అని ఆమె ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ప్రతి గిరిజనుడికి సంక్షేమ క్యాలెండర్ ప్రకారం పథకాలు అందిన విషయం నిజమా కాదా? అని ఆమె అన్నారు.
బాకై ్సట్ జీవోను తెచ్చింది చంద్రబాబు కాదా?
గిరిజన ప్రాంతంలో ఉన్న సంపదను దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు ఆనాడు జిందాల్ కంపెనీతో ఒప్పందం చేసుకొని బాకై ్సట్ జీవోను తీసుకొచ్చిన విషయం నిజమా? కాదా? అని ఆమె ప్రశ్నించారు. ఈ విషయంపై జీసీసీ చైర్మన్, ఇతర నాయకులకు అవగాహన ఉందా? లేదా? అని నిలదీశారు. బాకై ్సట్ తవ్వకాలపై తీసుకొచ్చిన 97 జీవోను వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసిన విషయాన్ని ఎందుకు మరిచిపో యారని నిలదీశారు. కాల్సైట్, బాకై ్సట్, లేటరైట్ గనులను అక్రమంగా తవ్వి సంపాదన సృష్టించుకో వాలని ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులు అధికారం చలాయించే విధానాన్ని రద్దు చేసింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డేనన్నారు. గత టీడీపీ ప్రభు త్వం గిరిజనతరులకు కూడా స్థానిక సంస్థల ఎన్ని కల్లో పోటీకి అవకాశం ఇస్తే.. ఆ విధానాన్ని రద్దు చేసి స్థానిక సంస్థల్లో వంద శాతంగిరిజనులే పోటీ చేసే విధానాన్ని వైఎస్ జగన్ తీసుకొచ్చిన విషయా న్ని గుర్తు చేశారు. గిరిజనులకు మేలు చేయడం అంటే ఇది కదా అని ఆమె పేర్కొన్నారు. గిరిజన శాఖ మంత్రి మాట్లాడుతూ గిరిజనులకు ఈ డీఎస్సీలో 2000 పోస్టులు ఇస్తున్నట్లు చెప్పారని, కానీ కేవలం 1023 పోస్టులు మాత్రమే కేటాయించి, ఎందుకలా తప్పుదారి పట్టిస్తున్నారని నిలదీశారు.
వైఎస్ జగన్ హయాంలో గిరిజనులకు మహర్దశ
డోలి మోతల గురించి గొప్పలు చెప్పుకోవద్దని, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డోలి మోతల నివారణ కోసం ప్రత్యేకంగా కనెక్ట్ పాడేరు పేరుతో ఒక ప్రాజెక్టును అమలు చేశారన్నారు. పాడేరు డివిజన్లో 1300కు పైగా గ్రామాలకు రహదారి సౌకర్యం లేదని గుర్తించి వాటి నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకొని, అన్నీ సిద్ధం చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి తామేదో చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తోందన్నారు. గిరిజన ప్రాంతంలో వైద్య సమస్యకు ఫుల్స్టాప్ పెట్టేలా పాడేరులో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిన మహనీయుడు ఎవరో చెప్పాలని, ఇటువంటి గొప్ప కార్యక్రమం చంద్రబాబునాయుడు తన 40 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా గిరిజనుల కోసం చేశారా? అని సుభద్ర నిలదీశారు.
మహానాడు వేదికపై అన్నీ అబద్ధాలే..
ఏడాదిలో గిరిజన సంక్షేమానికి ఒక్క పనైనా చేశారా?
కిడారి తదితర నేతల ప్రసంగాలపై నిలదీసిన జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర