
ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్గా కృష్ణారావు
అనకాపల్లి: ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ కె.కృష్ణారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన అల్లూరి జిల్లా డీసీహెచ్ఎస్గా, పాడేరు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్గా విధులు నిర్వహించి, ఫిబ్రవరి 21న అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి ఈఎన్టీ సర్జన్గా బదిలీపై వచ్చారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆదేశాల మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్గా నియమితులయ్యారు. గత సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు జిల్లా ఇన్చార్జి డీసీహెచ్ఎస్గా బాధ్యతలు స్వీకరించారు. సూపరింటెండెంట్ కె.కృష్ణారావుకు ఆస్పత్రి వైద్యులు, ఉద్యోగులు అభినంద నలు తెలిపారు.