
వ్యక్తిని రక్షించి.. యువకుడు మృతి
● రేవుపోలవరంలో విషాదం
ఎస్.రాయవరం: రేవుపోలవరం తీరంలో సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడబోయే ప్రయత్నంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ విభీషణరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. తుని మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన షేక్ ఇషాక్ మదీనా వలీ (20), షేక్ అలీషాలు అదేగ్రామానికి చెందిన షేక్ అహ్మదుల్లా ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్ కోసం బుధవారం రేవుపోలవరం తీరానికి వచ్చారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి సముద్రంలోకి కొట్టుకు పోతున్నట్టు గమనించారు. ఒడ్డున ఉన్న మహిళ బిగ్గరగా అరవడంతో విన్న ఇషాక్ మదీనా వలీ, అలీషాలు సముద్రంలోకి వెళ్లి ఆ వ్యక్తిని రక్షించారు. ఇంతలో రాకాసి అలలు పోటెత్తడంతో ఇషాక్మదీనావలీ కొట్టుకుపోయాడు.వెంటనే స్థానిక మత్స్యకారులు బయటకు తీసినప్పటికీ ప్రాణాలు నిలువలేదు. మృతదేహాన్ని నక్కపల్లి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.