
లీజు రద్దు చేయాలి
కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టు, రిజిస్టర్ ఆఫీస్, బీసీ, ఎస్సీ వెల్ఫేర్ తదితర కార్యాలయాలు నేటికీ అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వాటిపై దృష్టి సారించకుండా అధికార పార్టీకి మాత్రం స్థలం కేటాయించడమేంటి?. టీడీపీ కార్యాలయానికి అత్యంత చౌకగా, చట్టవిరుద్ధంగా కలెక్టర్ స్థలం కేటాయించడం తగదు. ఈ లీజును వెంటనే రద్దు చేయాలి. పేద ప్రజలకు కనీసం రెండు సెంట్ల నివాస స్థలం ఇవ్వడానికి ముందుకురాని అధికారులు అధికార పార్టీకి ఏ విధంగా స్థలాన్ని కేటాయిస్తారు. నాన్ షెడ్యూల్ ఏరియా లో వందలాది ఎకరాలు గిరిజనులు భూములు కబ్జాలకు గురై తీవ్ర ఇబ్బందులు పడుతూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా కనీసం పట్టించుకోవడం లేదు. ఆ సమస్యలపై అధికారులు దృష్టిసారించాలి.
–డి. వెంకన్న, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి