
విద్యుదాఘాతంతో ఒకరి మృతి
కె.కోటపాడు : చౌడువాడ శివారు మల్లంపాలెం గ్రామానికి చెందిన వంటాకు వెంకటరమణ(50) విద్యుత్ షాక్కు గురై గురువారం సాయంత్రం మృతి చెందారు. తన పొలంలోని మోటారు తిరగడం లేదని సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి సెక్షన్ బాక్స్ వద్ద ఉన్న ఫీజులను చెక్ చేస్తుండగా వెంకటరమణ విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు ఆయనను చౌడువాడ పీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కె.కోటపాడు సీహెచ్సీకి 108 వాహనంలో తరలిస్తుండగా.. మార్గం మధ్యలో ఆయన మృతిచెందాడు. మృతుడు భార్య సత్యవతి గురువారం రాత్రి కె.కోటపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును నమోదు చేసి ఎస్ఐ ఆర్.ధనుంజయ్ దర్యాప్తు చేపట్టారు. అందరితోను మంచిగా ఉండే వెంకటరమణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.