దుఃఖీభవ | - | Sakshi
Sakshi News home page

దుఃఖీభవ

Jun 26 2025 6:35 AM | Updated on Jun 26 2025 6:35 AM

దుఃఖీ

దుఃఖీభవ

అన్నదాత
ఖరీఫ్‌లో మొదలైన కష్టాలు

పూర్తిస్థాయిలో అందుబాటులో

లేని వరి విత్తనాలు

56,292 హెక్టార్లలో 46 వేల

హెక్టార్లకు మాత్రమే సరఫరా

ప్రచారానికే పరిమితమైన

‘అన్నదాత సుఖీభవ’

1.69 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమకాని రూ.127 కోట్లు

సాగు పెట్టుబడికోసం వడ్డీ వ్యాపారులు, బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్న

గిరి రైతులు

సాక్షి,పాడేరు: ఖరీఫ్‌ సాగుకు అనుకూలంగా వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 22 మండలాల పరిధిలో ఏటా 56,292 హెక్టార్లలో ఖరీఫ్‌లో వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో సాగుకు ఉపక్రమించారు. దుక్కి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇందుకు పశువులు, ట్రాక్టర్లు, టిల్లర్లను వినియోగిస్తున్నారు. నారుమడుల తయారీ పనులు ఊపందుకున్నాయి. పూర్తిస్థాయిలో విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో దిగులు చెందుతున్నారు. జిల్లాలో సాగు విస్తీర్ణానికి తగ్గట్టుగా విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా సాగు విస్తీర్ణం 56,292 హెక్టార్లు కాగా 46 వేల హెక్టార్లకు అవసరమైన 23,078 క్వింటాళ్ల వరి విత్తనాలను 90శాతం రాయితీపై ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. మిగతా 10,292 హెక్టార్ల విస్తీర్ణానికి విత్తనాలు ప్రశ్నార్థకంగా మారాయి. దీంతో ప్రైవేట్‌ మార్కెట్‌లో అధిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అన్నదాత సుఖీభవ సాయం అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుకు ఏటా రూ.20 వేలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం వారి ఖాతాల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా నేటికీ జమ కాలేదు. జిల్లాలో 1.69 లక్షల మంది రైతులకు రూ.127 కోట్లు ప్రభుత్వం జమచేయాల్సి ఉంది. సాయం అందక మెజారిటీ రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులు, బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నారు.

నాలుగు బస్తాలకు.. రెండే..

కొయ్యూరు: మండలంలోని రైతులు విత్తన కొరతను ఎదుర్కొంటున్నారు. నాలుగు బస్తాల విత్తనాలు కావాల్సిన రైతులకు ఒకటి లేదా రెండు బస్తాలు ఇచ్చి సరిపెడుతున్నారు. విత్తనాలు ఉండవన్న భయంతో బుధవారం ఒకపక్క వర్షం పడుతున్నా సింగవరం రైతు సేవా కేంద్రానికి రైతులు భారీగా తరలివచ్చారు. సాగు విస్తీర్ణం మేరకు మండలానికి 839 క్వింటాళ్ల వరకు విత్తనాలు అవసరం కాగా 654 క్వింటాళ్లకు మాత్రమే అనుమతి వచ్చింది.ఇంకా 185 క్వింటాళ్ల రావలసి ఉంది. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి ప్రియాంక మాట్లాడుతూ ఈక్రాప్‌లో నమోదైన రైతులకు మాత్రమే విత్తనాలు వస్తున్నాయన్నారు. రెండో విడత ఇండెంట్‌కు సంబంధించి విత్తనాలు రావాల్సి ఉందన్నారు. రైతులు 20శాతం మేర సమకూర్చుకోవాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

జిల్లా సమాచారం

మండలాలు : 22

వరి సాధారణ విస్తీర్ణం : 56,292

సిద్ధంగా ఉన్న విత్తనాలు : 23,078 క్వింటాళ్లు

కొరత : 10,292 హెకార్లు

అన్నదాత సుఖీభవ రైతులు : 1.69 లక్షలు

ఖాతాల్లో జమ కాని నిధులు :రూ.127కోట్లు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే మేలు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి ఏటా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందేది. కూటమి ప్రభుత్వం గత ఏడాది రైతులకు ఆర్థిక సాయం అందించలేదు. ఖరీఫ్‌ వ్యవసాయ పనులు ప్రారంభమైనప్పటికీ ఇంత వరకు అన్నదాత సుఖీభవ సాయం పంపిణీ ఊసేలేదు. రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.

– పాంగి సన్యాసిరావు, గిరిజన రైతు, పందిదొర్లు, మోదాపల్లి పంచాయతీ, పాడేరు మండలం

దుఃఖీభవ1
1/2

దుఃఖీభవ

దుఃఖీభవ2
2/2

దుఃఖీభవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement