
లంబసింగి అందాలు అద్భుతం
● అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి నళినీ కుమార్ శ్రీవాస్తవ
చింతపల్లి: లంబసింగి అందాలు అద్భుతమని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస నళినీ కుమార్ శ్రీవాస్తవ అన్నారు. బుధవారం ఆయన లంబసింగి ప్రాంతాన్ని సందర్శించారు. ఆయనకు పాడేరు సబ్ కలక్టర్ శౌర్యమాన్ పటేల్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.లంబసింగితో పాటు చెరువులవేనం వ్యూపాయింట్, తాజంగి జలాశయాన్ని ఆయన సందర్శించారు. ఈ ప్రాంత అందాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ఆయన వెంట తహసీల్దారు రామకృష్ణ పాల్గొన్నారు.