
బడి ఈడు పిల్లలంతా బడిలోనే ఉండాలి
సాక్షి,పాడేరు: పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో బడిఈడు పిల్లలంతా బడుల్లోనే ఉండాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు. పాఠశాల విద్యాఽశాఖ రూపొందించిన ఎన్రోల్మెంట్ డ్రైవ్ ప్రచార పోస్టర్లను బుధవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వచ్చేనెల 13వతేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పాఠశాలల ఎన్రోల్మెంట్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలన్నారు. గ్రామ, మండల స్థాయి కమిటీలన్నీ ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలని, బడికి దూరంగా ఉన్న డ్రాపౌట్ విద్యార్థులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలన్నారు. తల్లిదండ్రులకు కూడా పిల్లల చదువులు, భవిష్యత్పై అవగాహన కల్పించాలన్నారు. బడిఈడు పిల్లలు బాల కార్మికులుగా ఎక్కడ పనుల్లో ఉన్నా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బడిబయట పిల్లలు లేని గ్రామాలుగా ప్రకటించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో డీఈవో పి.బ్రహ్మాజీరావు, డీఆర్డీఏ పీడీ మురళీ, సర్వశిక్ష ఏపీసీ డాక్టర్ స్వామినాయుడు, ఇన్చార్జి గిరిజన సంక్షేమశాఖ డీడీ రజనీ, సర్వశిక్ష అధికారి ప్రకాష్ పాల్గొన్నారు.
రుణపరిమితి మించాలి
వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణపరిమితి పెంచాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, అనుబంధ శాఖలు,బ్యాంకు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.1145.67కోట్ల వార్షిక రుణ ప్రణాళికలను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ సచివాలయాల వారీగా రైతులను గుర్తించి జాబితాలను సిద్ధం చేయాలని సూచించారు. వ్యవసాయానుబంధ రంగాలకు రుణాలు మంజూరు చేయాలన్నారు. గిరిజన రైతులు, వ్యాపారులు, మహిళా సంఘాలకు బ్యాంకులన్నీ పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చి శతశాతం లక్ష్యాలను సాధించాలన్నారు. అలాగే ఐటీడీఏ ఏపీవోలు, వెలుగు, గిరిజన సంక్షేమశాఖ, విద్యాఽశాఖ, ఎస్ఎంఐ, ఐసీడీఎస్ అధికారులతోను సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చిరంజీవి నాగ వెంకట సాహిత్, యూనియన్ బ్యాంకు రీజినల్ అధికారి జితేంద్రశర్మ, ఆర్బీఐ జిల్లా అధికారి నవీన్, ఎల్డీఎం మాతునాయుడు, వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు ఎస్బీఎస్.నందు, రమేష్ కుమార్రావు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశం