
సొంత మండలాలకుబదిలీ చేయాలని వినతి
సాక్షి,పాడేరు: జిల్లాలోని సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఉద్యోగులను సొంత మండలాలకు బదిలీలు జరపాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్కు వారంతా విన్నవించుకున్నారు. బుధవారం వారంతా కలెక్టర్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. రాష్ట్రంలో క్లస్టర్ మ్యాపింగ్ తరువాత రెండు క్లస్టర్లకు ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ పనిచేస్తుండడంతో పనిభారం అధికమైందని, రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతం మందికే బదిలీ చేశారన్నారు. మిగిలిన ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఏశాఖకు బదిలీ చేస్తారో తెలియక గందరగోళం నెలకొందని వారు కలెక్టర్కు నివేదించారు. ఈసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు కలెక్టర్ హమీ ఇచ్చారు.