
ఉపాధి పనుల్లో అక్రమాలుసహించేది లేదు
డ్వామా పీడీ విద్యాసాగర్
అడ్డతీగల: ఉపాధి హామీ పథకం పనుల్లో అక్రమాలు సహించేది లేదని డ్వామా పీడీ డి.వి. విద్యాసాగర్ అన్నారు. స్థానిక సీ్త్ర శక్తి భవనంలో మంగళవారం ఉపాధి హామీ పథకం 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు.ఈ సదస్సుకు హాజరైన పీడీ మాట్లాడుతూ పనుల నిర్వహణ, వేతనదారులకు వేతనాలు చెల్లింపులో ఎటువంటి అవకతవకలకు పాల్పడరాదన్నారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి పనులు కల్పించాలని ఆదేశించారు.గ్రామాల్లో సకాలంలో సక్రమంగా పనులు పూర్తిచేయాలని సూచించారు. అక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలోని 22 పంచాయతీల్లో రూ.16.85 కోట్ల వ్యయంతో నిర్వహించిన 1,722 పనులను సామాజిక తనిఖీ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్టు చెప్పారు. వేతనాల కోసం రూ.13.80 కోట్లు, మెటీరియల్కు రూ.2.28 కోట్లు చెల్లించినట్టు పేర్కొన్నారని తెలిపారు. ఉపాధి హామీ సిబ్బంది నుంచి రూ.32 వేలు రికవరీ చేసినట్టు చెప్పారు.రూ.25 వేలు జరిమానా విధించినట్టు ఆయన తెలిపారు.ఎంపీడీవో కె.ఆర్.విజయ, ఏపీవో చిరంజీవి రావు పాల్గొన్నారు.