అయోమయం | - | Sakshi
Sakshi News home page

అయోమయం

Jun 11 2025 8:45 AM | Updated on Jun 11 2025 8:45 AM

అయోమయ

అయోమయం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024–25లో తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేయలేదు. దీనివల్ల ఒకొక్కరికి రూ.15 వేల చొప్పున 1,78,887 మంది విద్యార్థులు ఆర్థిక లబ్ధి కోల్పోయారు.
తల్లికి వందనం

బుధవారం శ్రీ 11 శ్రీ జూన్‌ శ్రీ 2025

అరకు రేంజ్‌ ఆఫీసర్‌శ్రీనివాసరావు బదిలీ

అరకులోయ టౌన్‌: అరకు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావుకు బదిలీ అయింది. ఆయనను విజయనగరం సా మాజిక అడవుల పరిరక్షణ, నిర్వహణ విభాగానికి బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన అరకు పైనరీ, ఎకో పార్కును ఆదర్శవంతంగా తీర్చిదిద్ది అటవీశాఖకు ఆదాయ వనరులను మెరుగుపరిచారు. ఆయన స్థానంలో ఎవ్వరినీ నియమించలేదు.

ఈ ఏడాది అమలుపై కానరాని

స్పష్టత

గతేడాది

జమ చేయక

తల్లుల్లో నిరాశ

దాటవేత ధోరణితోకూటమి

ప్రభుత్వం

విధి విధానాలు ప్రకటించని పాలకులు

తల్లికి వందనం పథకం అమలు చేయాలని కోరుతూ పిల్లలతో గిరిజన తల్లులు

గత ప్రభుత్వంలో చేకూరిన లబ్ధి

సంవత్సరం లబ్ధి మొత్తం

(రూ.కోట్లలో)

2020–21 1,51,603 151.08

2021–22 1,51,603 151.08

2022–23 1,51,603 151.08

2023–24 1,51,575 151.75

ముంచంగిపుట్టు: కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని వాయిదాలు వేసుకుంటూ వస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో నీకు రూ.15 వేలు.. నీకు రూ.15వేలు అంటూ ప్రచారం చేసిన చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత తొలిఏడాదిలో ఏఒక్కరికి కూడా జమ చేయలేదు. ఈ ఏడాది పాఠశాలలు తెరిచేనాటికి వందనం పథకం అమలు చేస్తామని చంద్రబాబు, మంత్రులు ప్రకటనలు చేస్తున్నా ఇప్పటికీ దీనిపై ఇప్పటికీ స్పష్టత కనిపించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు చదువుకు చేయూత అందుతుందని, కొంతమేర ఖర్చుల భారం తగ్గుతుందని ఆశిస్తున్న వారికి ప్రభుత్వం తీరు నిరాశ కలిగిస్తోంది.

విధి విధానాలేవీ?

పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ విధి విధానాలను ప్రకటించలేదు. ఆర్థికశాఖ సైతం ఈ పథకం అమలుకు ఎటువంటి సూచనలు చేయలేదు. ఈ ఏడాదైనా తల్లికి వందనం ఉంటుందా.. లేకపోతే ఎగనామం పెడతుందా అనే అనుమానాలు తల్లిదండ్రుల్లో నెలకొన్నాయి.

ఎన్‌పీసీఐ లింక్‌ కోసం పరుగులు

తల్లికి వందనం పథకానికి విధి విధానాలు అధికారికంగా నేటికి విడుదల కాలేదు. కానీ పథకం అమలు కావాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్‌ ఖాతాను ఆధార్‌ నంబరు ఎన్‌పీసీఐతో లింక్‌ చేసుకోవాలని ప్రచారం జరుగుతోంది. దీంతో విద్యార్థుల తల్లులు ఆధార్‌ కేంద్రాలు, బ్యాంక్‌, పోస్టాఫీసులు, గ్రామ, వార్డు సచివాలయాలకు పరుగులు పెడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించి ఎన్‌పీసీఐకి లింక్‌ చేసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఎన్‌పీసీఐతో లింక్‌ చేసుకోని వారు సుమారు 15 వేల మంది వరకు ఉన్నారని సమాచారం.

ఈ ఏడాది ఎగనామమేనా?

ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. నేటికి తల్లికి వందనం పథకంపై ఎటువంటి మార్గదక్శకాలు ప్రభుత్వం జారీ చేయలేదు. బీపీఎల్‌ కుటుంబాలకు చెందిన తల్లులకు ఏడాదికి రూ.15వేలు అందిస్తారా లేక విద్యార్థులకు 75శాతం హాజరు నిబంధన పెడతారా, అమలు చేస్తారా.. చేయరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రేషన్‌ వాహనాల

రద్దుతో తీవ్ర ఇబ్బందులు

రంపచోడవరం: కూటమి ప్రభుత్వం రేషన్‌ వాహనాలు రద్దు చేయడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్‌ సీపీ ఎస్టీ సెల్‌ నియోజకర్గ కన్వీనర్‌ పండా రామకృష్ణదొర ఆరోపించారు. ఈ నెల గిరిజనులు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి రేషన్‌ తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకే రేషన్‌ వాహనాలను ఏర్పాటు చేశారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం రేషన్‌ వాహనదారులకు ఉపాధి లేకుండా చేశారని ఆరోపించారు. వృద్ధులు, వికలాంగులు రేషన్‌ పొందేందుకు ఇబ్బందులు పడుతున్నందున ఏజెన్సీ ప్రాంతంలో రేషన్‌ వాహనాలు పునరుద్ధరణ చేయాలని డిమాండ్‌ చేశారు.

తీవ్ర ఇబ్బంది పడిన టీచర్లు

కనీస ఏర్పాట్ల కరువు

అధికారుల నిలదీత

సాంకేతిక లోపం అంటూ

నేటికి కౌన్సెలింగ్‌ వాయిదా

న్యూస్‌రీల్‌

పోలవరం ‘ఆర్‌అండ్‌ఆర్‌’లో పనిచేసేందుకు దరఖాస్తుల ఆహ్వానం

రంపచోడవరం: పోలవరం ప్రాజెక్టు ఆర్‌అండ్‌ఆర్‌ కార్యాలయంలో పనిచేసేందుకు రిటైర్డ్‌ తహసీల్దార్ల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ కేఆర్‌ కల్పశ్రీ తెలిపారు. తాత్కాలిక పద్ధతిపై పనిచేసేందుకు రిటైర్డ్‌ తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రిటైర్డ్‌ సివిల్‌ ఇంజనీర్ల నియామకానికి సంబంధంచి ఎనిమిది పోస్టులు ఖాళీ ఉన్నట్లు తెలిపారు. రంపచోడవరం, ఎటపాక, చింతూరు, ఏలూరు జిల్లా కేఆర్‌పురం, పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ కార్యాలయాల్లో పనిచేసేందుకు ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ ఉత్తర్వుల ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు. ధరఖాస్తులను ధవళేశ్వరం ఆర్‌అండ్‌ఆర్‌ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేట్‌వ్‌ కార్యాలయంలో స్వయంగా అందజేయాలని తెలిపారు.

గత ప్రభుత్వంలో ఏటా క్రమం తప్పకుండా..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమ్మఒడి పథకాన్ని క్రమం తప్పకుండా అమలు చేశారు. రూ.15 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమచేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలన్న తేడా లేకుండా బీపీఎల్‌ కుటుంబాలందరికీ లబ్ధి చేకూర్చారు. చదువుకు అయ్యే అదనపు ఖర్చులు ఈ సొమ్ముతో ఒడ్డెక్కి పోయేవి. పిల్లల చదువుకు ఎంతో దోహదపడేవని గత ప్రభుత్వంలో మేలును గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మరోసారి మోసపోయామని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.

స్పష్టత ఇవ్వని ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమందికి రూ.15వేల చొప్పున ఇస్తామని చెప్పడంతో నమ్మి ఓటు వేశాం. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిపోయింది. మొదటి సంవత్సరం అమలు చేయలేదు. రెండో ఏడాది వచ్చేసింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రూ. 30వేలు ఖాతాలో జమకావాలి. మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా తల్లికి వందనం పడుతుందో లేదో స్పష్టత లేదు. – కొర్రా సువర్ణ,

బురుసింధిపుట్టు, ముంచంగిపుట్టు మండలం

డ్రాపవుట్స్‌ పెరిగే అవకాశం

తల్లికి వందనం అమలు చేయకపోవడం అన్యాయం.ఎన్నికల ముందు ఇంటిలో ఎంత మంది విద్యార్థులు ఉంటే అంత మందికి రూ.15వేల చొప్పున ఇస్తామన్న మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.చంద్రబాబు పాలన తల్లికి నిల్‌..తండ్రికి ఫుల్‌ అన్న చందంగా ఉంది.గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో డ్రాప్‌ అవుట్లు తగ్గించడం కోసం అమ్మ ఒడి పథకాన్ని వైఎస్‌ జగన్‌ తెచ్చారు.ఇప్పుడు చంద్రబాబు నిర్వాకం వల్ల మళ్లీ డ్రాప్‌ ఔట్స్‌ పెరిగే అవకాశం ఉంది. జల్లిపల్లి సుభద్ర,

ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌

రూ.30 వేలు వస్తుందనిఆశపడ్డా

మాకు ఇద్దరు సంతానం. వీరిలో ఒకరు 8, మరొకరు 4వ తరగతి చదువుతున్నారు. ప్రభు త్వం తల్లికి వందనం పథకం ద్వారా రూ.15వేల చొప్పున రూ.30వేలు బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నా. గత ఏడాది వేస్తారని నమ్మి మోసం పోయా. ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాదైనా తల్లికి వందనం అమలు చేసి నగదు జమ చేస్తారని భావిస్తున్నా. ఈ ఏడాదైనా వేయకపోతే మోసపోయినట్టే. – ముఖి పద్మ,

కరిముఖిపుట్టు, ముంచంగిపుట్టు మండలం

అయోమయం1
1/3

అయోమయం

అయోమయం2
2/3

అయోమయం

అయోమయం3
3/3

అయోమయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement