
బాల్య వివాహాల నివారణకు పటిష్ట చర్యలు
కలెక్టర్ దినేష్కుమార్
సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా బాల్య వివాహాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. సుండ్రుపుట్టు అంగన్వాడీ కేంద్రంలో బాల్య వివాహాల నిర్మూలన, బాలికల విద్య, పౌష్టికాహారం,కిశోర బాలికల వికాసం, కెరీర్ గైడెన్స్పై మంగళవారం ఐసీడీఎస్ నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కిషోర వికాసం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. బాల్య వివాహలతో ఏర్పడే అనర్ధాలను గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. అనంతరం అంగన్వాడీ చిన్నారులతో కలెక్టర్ అక్షరాభ్యాసం చేయించారు.ఈ కార్యక్రమంలో సీడీపీవో ఝాన్సీరాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి సద్దు, ఎంపీడీవో రతన్తేజ, ఎంఈవో–2 సరస్వతి, ఈవోపీఆర్డీ రమేష్ పాల్గొన్నారు.
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించండి
రైతులు అధిక దిగుబడులు సాధించే లక్ష్యంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ నుంచి వ్యవసాయ,అనుబంధ శాఖల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్గానిక్ వ్యవసాయానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రానున్న రోజుల్లో రైతులు రసాయన ఎరువులు వినియోగం పూర్తిగా తగ్గించాలన్నారు. ఖరీఫ్లో రైతులకు సకాలంలో విత్తనాలు పంపిణీ చేయాలన్నారు. కాఫీ,మిరియం పంట కోతలు అనంతరం చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. కాఫీ రైతులకు అవసరమైన టార్పాలిన్లు, బేబీ పల్పర్యూనిట్టు, నిచ్చెనలు, కల్యాల నిర్మాణాల వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. కూరగాయల పెంపకం విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.మారేడుమిల్లి, వై.రామవరం మండలాల్లో పైనాపిల్ పండ్ల తోటల సాగు, చింతూరు డివిజన్లో మల్బరి సాగును విస్తరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం, జిల్లా వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు ఎస్బీఎస్ నందు, రమేష్కుమార్రావు, పశుసంవర్ధకశాఖ ఏడీ నరసింహులు, పట్టుపరిశ్రమశాఖ అఽధికారి అప్పారావు పాల్గొన్నారు.

బాల్య వివాహాల నివారణకు పటిష్ట చర్యలు