
మొండి జాంగుడలో కలకలం
అనంతగిరి (డుంబ్రిగుడ/అరకులోయ టౌన్): తాను ఎంతోగానో ప్రేమించిన యువతి త్వరలోనే పెళ్లి చేసుకోనున్న తరుణంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో ఆందోళనకు గురైన యువకుడు తనకేమైనా అవుతోందేమోనన్న భయంతో గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనఅనంతగిరి మండల కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న మొండి జాంగుడ గ్రామంలో మంగళవారం కలకలం రేపింది. అనంతగిరి ఎస్ఐ డి. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి పంచాయతీ మొండి జాంగుడ గ్రామానికి చెందిన జన్ని రాంబాబు ఆదే పంచాయతీ లక్ష్మీపురం గ్రామానికి చెందిన నందుల నీలమ్మ అనే యువతి ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను తన ఇంటికి తీసుకువచ్చి ఎనిమిది నెలలుగా సహజీవనం చేస్తున్నాడు. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. అయితే ఏమైందో తెలియదు గాని మంగళవారం ఉదయం జామంగు గ్రామంలో ఇంటివద్ద నీలమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉంది. దీనిని చూసిన యువకుడు జన్ని రాంబాబు ఒక్కసారిగా తీవ్రమానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ పరిస్థితుల్లో పెద్దలు ఏమంటారోనని ఆందోళనలో గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించినట్టు ఎస్ఐ తెలిపారు. స్థానికులు గుర్తించి వెంటనే యువకుడిని అనంతగిరి పీహెచ్సీకి తరలించి వైద్యసేవలు అందించారు. మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఎస్కోట ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు సేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.
అనుమానాస్పదస్థితిలో యువతి మృతి
భయంతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించిన యువకుడు

మొండి జాంగుడలో కలకలం