సోలార్‌ యూనిట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

సోలార్‌ యూనిట్ల పరిశీలన

Jun 11 2025 8:45 AM | Updated on Jun 11 2025 8:45 AM

సోలార్‌ యూనిట్ల పరిశీలన

సోలార్‌ యూనిట్ల పరిశీలన

రాజవొమ్మంగి: మండలంలో పలు ఆదివాసీ కుటుంబాలకు పీఎం జన్‌మన్‌ పథకంలో ఏర్పాటు చేసిన సోలార్‌ యూనిట్ల పనితీరును ఏపీఈపీడీసీఎల్‌ డీఈఈ గాబ్రియేల్‌ మంగళవారం పరిశీలించారు. మండలంలోని కొమరాపురం పరిసర అటవీ ప్రాంతాలు, వ్యవసాయక్షేత్రాల్లో నివసిస్తున్న 58 కుటుంబాలకు సోలార్‌ యూనిట్లను గతంలో ఏర్పాటుచేశారు. వీటి పనితీరు, వినియోగాన్ని ఆయన పరిశీలించారు. ఒకొక్క యూనిట్‌కు రూ.70 వేలు ఖర్చయిందన్నారు. సోలార్‌ యూనిట్లు ఏర్పాటైన తరువాత తమ జీవితాల్లో వెలుగులు వచ్చాయని ఆదివాసీ మహిళలు రాజయమ్మ, పార్వతమ్మ తదితరులు ఆనందం వ్యక్తం చేశారు. అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుకోగలుగుతున్నామన్నారు. ఇదిలా వుండగా రాజవొమ్మంగిలోని 33/11 కేవీ విద్యుత్‌ స్టేషన్‌ను పరిశీలించిన డీఈఈ. సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు ఇచ్చారు. ఆయన వెంట అడ్డతీగల ఏడీ దివాకర్‌, రాజవొమ్మంగి ఏఈ అబ్బాయిదొర, ఇంజనీర్లు పోలేశ్వర్రావు, శ్రీనివాస్‌, రాజేష్‌, రాఘవరెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement