
బయో డైవర్సిటీ పార్కులో శ్రీగంధం చెట్ల నరికివేత
బీచ్రోడ్డు: పెదవాల్తేరులోని బయో డైవర్సిటీ పార్కులో 23 ఏళ్ల వయసున్న మూడు శ్రీగంధం చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికేశారు. ఈ దొంగలు పార్కు కంచెను తొలగించి, ఆరు నుంచి ఏడు అడుగుల పొడవైన కలప దుంగలను దొంగిలించారు. పార్కు నిర్వాహకుడు రామమూర్తి సోమవారం ఉదయం చెట్లు నరికివేయడాన్ని గుర్తించారు. వెంటనే మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది కేవలం గంధపు చెట్ల దొంగతనం కాదని, పార్కును నాశనం చేయడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. చెట్లను నరికిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించి, పార్కును రక్షించాలని పోలీసులను కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బయో డైవర్సిటీ పార్కులో శ్రీగంధం చెట్ల నరికివేత