
ఆర్ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
చింతపల్లి: స్థానిక గురుకుల సాంకేతిక పారిశ్రామిక శిక్షణ (ఆర్ఐటీఐ)కేంద్రంలో మొదటి విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ శ్రీనివాసచారి తెలిపారు. 25–26 విద్యాసంవత్సరానికి గాను ఈ శిక్షణ కేంద్రంలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో 40, మోటారు వెహికల్ మెకానిక్ 24, ఫిట్టర్ 20, వెల్డర్ 40, ప్లంబర్ 24, వుడ్ వర్క్టెక్నీషియన్ 24,స్టెనో గ్రాఫర్ ట్రేడ్లో 24 సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తిగలవారు మే 24వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 26న ఒరిజనల్ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించనున్నట్టు చెప్పారు.