మలేరియా రహితసమాజం కోసం కృషి | - | Sakshi
Sakshi News home page

మలేరియా రహితసమాజం కోసం కృషి

Apr 26 2025 1:25 AM | Updated on Apr 26 2025 1:25 AM

మలేరియా రహితసమాజం కోసం కృషి

మలేరియా రహితసమాజం కోసం కృషి

ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌

చింతూరు: మలేరియా రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో చింతూరులో శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ చింతూరు డివిజన్‌లో గత ఏడాది 382 మలేరియా కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 170 కేసులు నమోదైనట్టు తెలిపారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు దో మతెరలు వినియోగించాలని, మురుగునీరు నిలువ లేకుండా చూడాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ పుల్లయ్య, ఎంపీడీవో రామకృష్ణ, డాక్టర్‌ నిఖిల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement