
కాపీ రైతు కష్టం ఐటీడీఏ పాలవుతోంది. మద్దతు ధర పొందడంలో ర
ఐటీడీఏ
చేతిలో
సాక్షి,పాడేరు: అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన జిల్లాలో కాఫీ పంటకు పండ్ల దశలోనే ఈఏడాది డిమాండ్ ఏర్పడింది. బెంగళూరు మార్కెట్లో కాఫీ గింజల వ్యాపారం భారీగా జరుగుతోంది. జిల్లాలో ఈ ఏడాది కాఫీ పంట దిగుబడి కాస్త తగ్గినప్పటికీ నాణ్యమైన కాఫీ కావడంతో ప్రైవేట్ వ్యాపారులు,స్వచ్ఛంద సంస్థలు,కార్పొరేట్ సంస్థలు ఇక్కడ కాఫీపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. 1.90 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఫలసాయం ఇచ్చే కాఫీ తోటలను గిరిజన రైతులు సాగు చేస్తున్నారు.14వేల మెట్రిక్ టన్నుల పాచ్మెంట్ కాఫీ గింజలు ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం.
నాంది సంస్థ రూ.90తో కొనుగోలు
మన్యంలో కాఫీ పండ్ల సీజన్ ప్రారంభం నుంచి నాంది కార్పొరేట్ సంస్థ దూకుడుగా ఉంది. ఐటీడీఏకు చెందిన చింతపల్లి మ్యాక్స్ సంస్థ సీజన్ ప్రారంభం నుంచి కిలో రూ.44ధరతో కారుచౌకగా కొనుగోలు చేసింది.ఇప్పటికే ఐటీడీఏ కాఫీ విభాగం 700 మెట్రిక్ టన్నుల వరకు కాఫీ పండ్లను సేకరించి చింతపల్లి మ్యాక్స్ సంస్థకు తరలించింది.అయితే అరకులోయలోని చినలబుడు కేంద్రంగా పనిచేస్తున్న నాంది అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థ మాత్రం కాఫీ పండ్లను కిలో రూ.90 రికార్డు ధరతో కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే 2,000 టన్నుల వరకు కాఫీ పండ్లను కొనుగోలు చేసింది. దీంతో ఆ సంస్థకు పండ్లు విక్రయించిన రైతులు అధిక లాభాలు పొందారు. ఆరు కిలోల కాఫీ పండ్ల ద్వారా కిలో పాచ్మెంట్ ఎండు గింజలు ఉత్పత్తి అవుతాయి.అంటే కిలోకు రూ.540 ఆదాయం వస్తుంది. అలాగే జిల్లాలోని 12 రైతు ఉత్పత్తి సంఘాలు కిలో రూ.60 చొప్పున కాఫీ పండ్లు కొనుగోలు చేశాయి. ఇప్పటి వరకూ ఒక్కో సంఘం 500 టన్నులు చొప్పున సేకరించాయి.
మ్యాక్స్ రూ.44తో కొనుగోలు
ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐటీడీఏ మ్యాక్స్ మాత్రం కిలో కాఫీ పండ్లను రూ.44తక్కువ ధరకు కొనుగోలు చేసింది. దీంతో ఈ సంస్థకు విక్రయించిన గిరిజన రైతులు కిలోకు రూ.200 నష్టపోయారు.ఇటీవల బెంగళూరు మార్కెట్లో అమ్మకాలు ద్వారా వచ్చిన ఆదాయంలో కిలోకు కేవలం రూ.8 బోనస్ చెల్లించడంపై కాఫీ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాఫీ పండ్లను కిలో రూ.90తో నాంది సంస్థ కొనుగోలు చేసి అధిక లాభాలు ఇస్తే,ఐటీడీఏ మాత్రం బోనస్తో కలుపుకొని కాఫీ పండ్లకు కిలో రూ.52చెల్లించడం అన్యాయమని రైతులు వాపోతున్నారు.
అతి తక్కువ ధర కిలో రూ.44తో కొనుగోలు చేసిన అధికారులు
ప్రైవేట్ సంస్థ రూ.90తో సేకరణ
ఆరు కిలోల కాఫీ పండ్లకు కిలో పాచ్మెంట్ గింజల ఉత్పత్తి
కిలోకు రూ.200 నష్టపోతున్న రైతులు
చోద్యం చూస్తున్న
అధికార యంత్రాంగం
గిట్టుబాటు ధరల కల్పనే లక్ష్యం
ఏజెన్సీలోని కాఫీ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నాం.చింతపల్లి మ్యాక్స్ సంస్థ ద్వారా కిలో రూ.44తో కొనుగోలు చేసిన కాఫీ పండ్లకు రూ.8బోనస్ చెల్లిస్తున్నాం.అన్ని ఖర్చులు పోను వచ్చే ఆదాయం కాఫీ రైతులకే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.నాంది సంస్థ పూర్తిస్థాయిలో నాణ్యమైన కాఫీ పండ్లను రైతుల నుంచి కొనుగోలుచేస్తోంది.చింతపల్లి మ్యాక్స్ సంస్థకు మాత్రం రైతులు కాయలు,పండ్లను కలిపి విక్రయిస్తుండడంతో నాణ్యత పరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
– ఎ.ఎస్.దినేష్కుమార్, కలెక్టర్

కాపీ రైతు కష్టం ఐటీడీఏ పాలవుతోంది. మద్దతు ధర పొందడంలో ర

కాపీ రైతు కష్టం ఐటీడీఏ పాలవుతోంది. మద్దతు ధర పొందడంలో ర

కాపీ రైతు కష్టం ఐటీడీఏ పాలవుతోంది. మద్దతు ధర పొందడంలో ర