సాత్నాల ప్రాజెక్టులో దూకి ఒకరి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

సాత్నాల ప్రాజెక్టులో దూకి ఒకరి ఆత్మహత్య

Oct 20 2025 7:38 AM | Updated on Oct 20 2025 7:38 AM

సాత్న

సాత్నాల ప్రాజెక్టులో దూకి ఒకరి ఆత్మహత్య

సాత్నాల: మండలంలోని సాత్నాల ప్రాజెక్టులో ఆది వారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్సై గౌతమ్‌పవార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రవెల్లి గ్రామానికి చెందిన, పవార్‌ బాలాజీ(37) ఆరు నెలల క్రితం, ఉపాధి కో సం సాత్నాల మండలం రామయికి వలస వచ్చాడు. సీస కమ్మరిగా, చికెన్‌ సెంటర్లో పనిచేస్తూ జీవనం కొ నసాగిస్తున్నారు. మద్యానికి బానిసైన బాలాజీ శని వారం రాత్రి భార్య, అత్తతో గొడవ పడ్డాడు. బామ్మర్దులు వారించారు. ఆదివారం ఉదయం పనికి వెళుతున్నానని చెప్పి, సాత్నాల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలాజీ తమ్ముడు సంజయ్‌ ఇచ్చి న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గౌతమ్‌పవార్‌ తెలిపారు.

పురుగుల మందు తాగి వ్యక్తి..

లక్ష్మణచాంద: అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పీచర గ్రామానికి చెందిన నైనం శేఖర్‌ (28) గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెందాడు. శనివారం ఉదయం గ్రామసమీపంలో గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన గ్రామస్తులు అందించిన సమాచారంతో కుటుంబ సభ్యులు అతన్ని నిర్మల్‌కు తరలించారు. చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి భార్య నాగలక్ష్మి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

సాత్నాల ప్రాజెక్టులో దూకి ఒకరి ఆత్మహత్య
1
1/1

సాత్నాల ప్రాజెక్టులో దూకి ఒకరి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement