
అర్హులకు సంక్షేమ ఫలాలు అందించాలి
దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక నంబర్
రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ వెంకటస్వామి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్ష
నాలుగు గంటలు కొనసాగిన సమావేశం
సాక్షి, ఆదిలాబాద్/కైలాస్నగర్: ప్రజాప్రభుత్వంలోనే రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకెళ్తోందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, మైనింగ్ శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందించే బాధ్యత అధికారులేదనని చెప్పారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారి జూపల్లి కృష్ణారావు, మరో మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి గురువారం ఆదిలాబాద్లో ని జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మ డి జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి హాజరయ్యా రు.
ఈ సందర్భంగా మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును స్పష్టం చేస్తూ అధికారులు ఎలా ముందుకెళ్లాలో దిశానిర్దేశం చేశారు. మొదట వ్యవసాయ శాఖపై సుదీర్ఘంగా సమీక్షించారు. రైతులకు విత్తనా లు, ఎరువుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు విక్రయించేవారికి జైలు శిక్ష పడేలా కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. ఇక నుంచి జిల్లాల వారీగానే స మీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
అనంతరం మృతి చెందిన స్వయం సహాయక సంఘాల కుటుంబీ కులకు మంజూరైన రూ.10లక్షల ఆర్థికసాయం చె క్కులు పంపిణీ చేశారు. పాఠశాల విద్యార్థులకు ట్యాబ్లు అందజేశారు. ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, జాద వ్ అనిల్కుమార్, వెడ్మ బొజ్జు, వినోద్, కోవ లక్ష్మి, హరీశ్బాబు, మహేశ్వర్రెడ్డి, రామారావుపటేల్, క లెక్టర్లు రాజర్షి షా, కుమార్ దీపక్, అభిలాష అభిన వ్, వెంకటేశ్ దోత్రే, ఐటీడీఏ పీవో ఖు ష్బు గుప్తా, ఎ స్పీలు అఖిల్ మహాజన్, జానకీ షర్మిల, కాంతిలా ల్, అడిషనల్ కలెక్టర్లు, ట్రైనీ కలెక్టర్లు, ఇతర అధికా రులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
మంత్రులకు ఘన సన్మానం
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన జూపల్లి కృష్ణారావుతోపాటు ఇటీవలే మంత్రిగా బా ధ్యతలు స్వీకరించిన ఉమ్మడి జిల్లాకు చెందిన వివేక్ తొలిసారి జిల్లాకు రాగా, వీరిని ఎమ్మెల్యేలు పాయ ల్ శంకర్, అనిల్జాదవ్, కోవ లక్ష్మి, కలెక్టర్ రాజర్షి షా శాలువాలతో సత్కరించారు. జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు. అంతకుముందు జిల్లాకు చేరుకున్న మంత్రులకు కలెక్టర్లు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనస్వాగతం పలికారు.
మంచిర్యాల ఎమ్మెల్యే గైర్హాజరు
ఆదిలాబాద్ జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యే గైర్హాజరుపై పలువురు చర్చించుకోవడం కనిపించింది.
ఎమ్మెల్యే కోవ లక్ష్మి అలక
సమావేశం ప్రారంభమయ్యాక కాసేపటికి వేదికపై కి వచ్చిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కుర్చీ లేకపోవడంతో కొద్దిసేపు నిల్చునే ఉన్నారు. జెడ్పీ సి బ్బంది కుర్చీ తీసుకువచ్చి వేయగా ఆసీనులయ్యా రు. ఈ తర్వాత ఏమనుకున్నారో తెలియదు గాని ఎ మ్మెల్సీ దండే విఠల్తో కలిసి వేదిక దిగి అధికారుల కుర్చీల్లో కూర్చున్నారు. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో దీన్ని గమనించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోవ లక్ష్మి వద్దకు వచ్చి తన సీట్లో కూర్చోవాలని కోరారు. మంత్రి కూడా ఆహ్వానించడంతో తిరిగి వేదికపైకి వచ్చి అనిల్ జాదవ్ సీట్లో కూర్చున్నారు.
సీఆర్ఆర్ ఇంటికి వెళ్లిన ‘జూపల్లి’
తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పట్టణంలోని శాంతినగర్లోగల మాజీ మంత్రి, దివంగత చిల్కూరి రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్కు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. రామచంద్రారెడ్డి మరణం కాంగ్రెస్కు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన మేనల్లుడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవరెడ్డిని పరామర్శించారు.
కేంద్రం నిధులు పెండింగ్లో పెట్టొద్దు
కోలాం, తోటి వంటి పీవీటీజీల ఇళ్ల నిర్మాణాలకు ఈజీఎస్ కింద కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖలకు చెల్లించకుండా పెండింగ్లో పెడుతోంది. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న రూ.742 కోట్లు వెంటనే విడుదల చేయాలి. 9,10వ తరగతుల విద్యార్థులకు ఎండీఎం నిధులు ఎందుకు విడుదల చేయడం లేదు? అర్హులైన గిరిజనులందరికీ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు వెంటనే జారీ చేయాలి. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన రోడ్లను ప్రభుత్వం నిర్మిస్తుందా? లేదా? అనేది స్పష్టం చేయాలి.
– గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎంపీ
‘కొరాటా– చనాకా’ పూర్తి చేయాలి
కొరాటా–చనాకా ప్రాజెక్ట్కు రూ.900కోట్లు ఖర్చు చేశారు. భూ సేకరణకు మరో రూ.100 కోట్లు విడుదల చేస్తే ప్రాజెక్ట్ పూర్తయి 50వేల ఎకరాలకు సాగునీరందే అవకాశముంది. సీఎం అసెంబ్లీలో మాటిచ్చినా ఒక్క రూపాయి కూడా రాలేదు. వర్షాలు కురుస్తున్నందున కనీసం మరమ్మతులైనా చేపట్టాలి. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యమై రైతులకు లబ్ధి చేకూర్చాలి. ఎయిర్పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ప్రణాళికలు పూర్తి చేయాలి.
– పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే
‘కుప్టి’కి నిధులు మంజూరు చేయాలి
కుప్టి ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు విడుదల చేసి టెండర్లు ఆహ్వానించాలి. బోథ్ నియోజకవర్గంలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుగ్గారం, పొచ్చెర, పిప్రికి లిఫ్ట్ ఇరిగేషన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే నిధులు విడుదల చేయాలి. భూభారతి చట్టం కాస్తు కాలంలో గిరిజనేతర పేర్లు చేర్చాలి. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక సరఫరా చేయాలి. బోథ్ ఆస్పత్రి వైద్యుడి డిప్యూటేషన్ను యథావిధిగా కొనసాగించాలి. వైద్యుల బదిలీ, డిప్యూటేషన్ల అధికారం కలెక్టర్లకు అప్పగించాలి.
– జాదవ్ అనిల్కుమార్, బోథ్ ఎమ్మెల్యే
అధికారుల తీరు సరికాదు
జిల్లాలో పోడు, రెవె న్యూ భూముల సమ స్య ప్రత్యేక సర్వే నిర్వహిస్తేనే పరిష్కారమవుతుంది. కడెం, దస్తురాబాద్ మండలాల్లో అటవీ అధికారులతో తీవ్ర ఇబ్బందులున్నాయి. వీరితో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. పీపీ ల్యాండ్స్ సాగు చేస్తున్న గిరిజనేతరులకు గతంలో పహాణీల ద్వారా రుణాలందేవి. 30–40 ఏళ్లుగా సాగు చేస్తున్న గిరిజనేతరులకు ప్రత్యామ్నాయం చూపాలి. ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారులను ఇతర జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయలి.
– వెడ్మ బొజ్జుపటేల్, ఖానాపూర్ ఎమ్మెల్యే